‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 22న ఈ సినిమా తాజా ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనబోతున్నట్టు అధికారిక సమాచారం. మేనల్లుడు సాయితేజ్ అంటే పవన్ కళ్యాణ్ కు అంతులేని అభిమానం. అతన్ని ‘రేయ్’ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ తపించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ‘రేయ్’ సినిమా మొదట ప్రారంభమైనా, జనం ముందుకు మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ మూవీ వచ్చింది.
ఆ మధ్య సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే, పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్ళి చూసి వచ్చాడు. ఇప్పుడు సాయితేజ్ నిదానంగా కోలుకుంటున్నా, ‘రిపబ్లిక్’ మూవీ పబ్లిసిటీలో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. దాంతో మెగా ఫ్యామిలీ హీరోలంతా అతనికి బాసటగా నిలిచి, ఈ మూవీ ప్రమోషన్ ను భుజానకెత్తుకుంటున్నారు. గత యేడాది సాయితేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల సమయంలో కూడా తెలుగు సినిమా రంగానికి చెందని హీరోలంతా సంఘీభావం ప్రకటించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత జనం ముందుకు వచ్చిన తొలి చిత్రం అదే కావడంతో… దాన్ని ఆదరించమంటూ ప్రజలను కోరారు. ఇప్పుడు సాయితేజ్ ఉన్న పరిస్థితి దృష్ట్యా ‘రిపబ్లిక్’ విషయంలోనూ అదే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ సానుభూతి పవనాలు ‘రిపబ్లిక్’ సక్సెస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి. అన్నట్టు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 25న జరుగబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!