MLA Muthireddy Yadagiri Reddy: ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులు బదానం చేస్తున్నారు.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Muthireddy Yadagiri Reddy: గతంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణలు చేశారు. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో అప్పుడా వివాదం సంచలనం రేపింది. అయితే ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తను కూతురు పై స్పందించారు.
Read Also: Fake Facebook Account: ఫేసుబుక్లో అబ్బాయిగా మారిన అమ్మాయి.. నమ్మి మోసపోయిన యువతి
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు. అయితే ఆ మాటలను తన నియోజకవర్గ ప్రజలు నమ్మ లేదని తెలిపారు.
Read Also: Wife Killed Husband: పార్టీలో గొడవైంది.. భర్తను చంపి ప్రియుడితో చెక్కేసింది
నేనేంటో.. నా ప్రవర్తన ఏంటో మా అధినేత సీఎంకు తెలుసన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాలను వెలికితీస్తున్నారని.. తన అల్లుడు, బిడ్డను ఉసిగొల్పి బధనం చేసేందుకు కొందరు రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రగా విమర్శించారు. అలా నన్ను బదనాం చేయాలని చేస్తే.. వారికి పిల్లలు ఉన్నారు. ఏదొక రోజు పాపం పండుతుందని.. ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా తనపై ఎవరైతే ఈ రాజకీయ కుట్రలు చేస్తున్నారో వాళ్ల ఆటలు సాగవు, నేనేంటో ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసన్నారు. నా కట్టే ఇక్కడే కాలుతుంది, నా చితి బస్పం నియోజకవర్గంలోని 176 చెరువుల్లో కలపాలి, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుంది అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!