హైదరాబాద్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241మంది వున్నారు. తెలంగాణ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5వ స్థానంలో వుంది. తెలంగాణలో ఇప్పటివరకూ 62 కేసులు నమోదయ్యాయి. రికవరీ అయినవారు 10 మంది. ఇదిలా వుంటే శంషాబాద్లో దిగిన ఓ బాలుడికి ఒమిక్రాన్ సోకింది.
దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులకు సోకింది వైరస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ దొడిలో ఓ బాలుడు (15)కి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. పదిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చిన అతడికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో జీనోమ్ సీక్వెన్సీకి పంపారు. అందులో ఒమిక్రాన్ ఉందని తేలడంతో అంతా అలర్ట్ అయ్యారు. అతడితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న 40 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో బాలుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆ శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సీకి పంపారు. వారందరికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దీంతో బాధితులందతా హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు.