ఒడిశా రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పటికే లాక్డౌన్ను అమలు జరుగుతున్నది. లాక్డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ఉదృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షల కంటే విద్యార్ధుల జీవితాలు ముఖ్యమైనవని, 12 వ తరగతి పరీక్షలను రద్ధు చేయాలని ఒడిశా కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.