పాట్నా పేలుళ్ల కేసు.. దోషులకు శిక్షలు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు.. 2013 పాట్నాలోని గాంధీ మైదాన్లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు.. ఈ కేసులో 10 మంది నిందితుల్లో తొమ్మిది మందిని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు అక్టోబర్ 27న దోషులుగా నిర్ధారించింది. ఇక, ఇవాళ వారికి శిక్షలు ఖరారు చేసింది.. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించగా, ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, మిగిలన మరో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు..
కాగా, 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన సందర్భంగా పాట్నాలోని గాంధీ మైదానంలో ‘హుంకార్’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.. అయితే, ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్దరిలింది.. సభా ప్రాంగణంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు జరిగాయి.. రెండు బాంబులు మోడీ ప్రసంగ వేదికకు అతి సమీపంలోనే పేలాయి.. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ కేసులో దాదాపు 8 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. 10 మందిని నిందితులుగా పేర్కొంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తొమ్మిది మందిని దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాదారాలు లేకపోవడంతో ఓ నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఇక, ఇవాళ శిక్షలు ఖరారు చేసింది.
Also Read
తాజావార్తలు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..