కోవిడ్ పరిస్థితుల పేరు చెప్పి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు పొడిగించడం, ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించడంపై మిశ్రమస్పందన కనిపిస్తోంది. అవగాహన లేక విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి,కొవిడ్ కెంద్రాలుగా తయారు చేస్తున్న వాటిని పట్టించుకోవడం లేదని, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు.
సూపర్ మార్కెట్స్, మామూలు మార్కెట్లు, సినిమా థియేటర్స్, మాల్స్,వైన్స్,బార్స్,క్లబ్స్. రాజకీయ సమూహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వుందని విమర్శిస్తున్నారు. అవగాహనా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ…విద్యానందించే విద్యాసంస్థలను మూసివేయడం, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళు, పాఠశాలల విషయంలో తీసుకున్న జాగ్రత్తలే మిగతా జనసమూహాలు తిరిగే చోట తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.