చీకట్లో గాడ్సేని మొక్కుతారు.. బయట గాంధీని పొగుడుతారు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా మోడీయాగా మారిందని దుయ్యబట్టారు.
నరేంద్ర మోదీ రైతు విరోధి. ప్రధాన మోడీని పంజాబ్ లో రైతులు అడ్డుకున్నారు. దేశచరిత్రలో ఏ ప్రధాన మంత్రికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎదురు కాలేదు. సిగ్గులేని… నీతిలేనిది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. పీఎం కిసాన్ సమ్మన్ పథకానికి స్ఫూర్తి ఎవరు ? ఇంటింటికి నల్లా నీళ్లు అంటున్నారు ? స్ఫూర్తి ఎవరు ? మేము కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిగ్గులేని మాటలు జేపీ నడ్డా మాట్లాడారు .తెలంగాణ లో ప్రభుత్వం పై ముందు రైతులను…ఇప్పడు ఉద్యోగులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 2022 కల్లా ఎన్నో చేస్తాం అన్నారు మోడీ కానీ ఏం చేయలేదు. ఇవన్నీ జుమ్లా అంటే…మా మీద హమ్లా. 5 లక్షల జాబ్స్ కేంద్రంలో ఉన్నాయి… వాటిని భర్తీ చేయరు. కానీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాలని దొంగ దీక్షలు చేస్తారు. జేపీ నడ్డాది …కేర్ ఆఫ్ ఎర్రగడ్డ అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అనే సన్నాసి ఉన్నాడు…వాడు పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగాడు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కాళేశ్వరం లో ఎటువంటి అవినీతి లేదని చెప్పారు. మరి మీకు మతి తప్పిందా ? …మీ కేంద్ర మంత్రికి మతి తప్పిందా ? కేసీఆర్ అన్నదాతలకు ఏటీఎం అన్నారు మంత్రి కేటీఆర్.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
మేకిన్ ఇండియా అని…మెడిన్ చైనా విగ్రహాలు మేము … మీలా మేం తెచ్చిపెట్టలేదు. బీజేపీ నేతలకు సిగ్గు ఉందా ? సిగ్గు …శరం..లజ్జా ఉందా?బీజేపీ నేతలకు. చీకట్లో గాడ్సే ను మొక్కుతారు…బయట గాంధీని మొక్కుతారు…బిజెపి నేతలను గాంధీ క్షమిస్తాడా?కుటుంబ పాలన గురించి జేపీ నడ్డా మాకు సుద్దులు చెబుతారు. ప్రజలతో ఎన్నుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల్లో ఉండకూడదా? అవినీతి గురించి జేపీ నడ్డా మాట్లాడతారా ? కర్ణాటక అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రం అని తేలింది. కర్ణాటక కాంట్రాక్టర్లు పీఎం మోడీ కి అక్కడి బీజేపీ నేతల తీరుపై లేఖ రాశారన్నారు కేటీఆర్.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!