Budget Session: పార్లమెంట్ పని చేసింది 45 గంటలే.. ఉభయ సభలు నిరవధిక వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో తరచూ వాయిదాలు, ఆందోళనలతో ఉభయ సభలు అనుకున్న సమయం కంటే తక్కువ నడిచాయి. రోజువారీ అంతరాయాలు, తరచుగా వాయిదాల కారణంగా లోక్సభ ఈ బడ్జెట్ సెషన్ షెడ్యూల్ చేయబడిన 133.6 గంటలకు సమయానికి బదులుగా కేవలం 45 గంటలు మాత్రమే పని చేసింది. అదే సెషన్లో రాజ్యసభ 130 గంటలకు 31 గంటలు మాత్రమే సభ నడిచింది. ఈ మేరకు PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ డేటా వెల్లడించింది. లోక్సభలో మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టగా.. ఆరు ఆమోదం చెందాయి.
Also Read:Japanese military helicopter: జపాన్ సైనిక హెలికాప్టర్ అదృశ్యం.. వారంతా క్షేమమేనా?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31, 2023 నుండి ఏప్రిల్ 6, 2023 వరకు కొనసాగాయి. ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు విరామం ఇచ్చారు. లోక్సభ 34.28 శాతం పనిచేయగా.. రాజ్యసభ కేవలం 24 శాతానికే పరిమితమైంది. శాసనసభ వ్యవహారాలు లోక్సభలో గంట కంటే తక్కువ సమయం పట్టగా, రాజ్యసభలో కేవలం రెండు నిమిషాలు మాత్రమే పట్టింది. ఆర్థిక వ్యవహారాలకు లోక్సభలో 17.25 గంటలు, రాజ్యసభలో 18.23 గంటలు పట్టింది. ఉభయ సభలు సమావేశమంతా ప్రశ్నోత్తరాల సమయం పదే పదే వాయిదా పడింది. లోక్సభలో క్వశ్చ్యన్ అవర్ 4.32 గంటలు నడవగా.. రాజ్యసభలో కేవలం 1.85 గంటలే కొనసాగింది.
Also Read:Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన ముగింపులో మాట్లాడుతూ, సాధారణ బడ్జెట్పై సభలో 14.45 గంటలపాటు చర్చలు జరిగాయని, 145 మంది ఎంపీలు అందులో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలు 13.44 గంటల పాటు 143 మంది ఎంపీల భాగస్వామ్యంతో జరిగాయి. లోక్సభలో ఎనిమిది ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టగా, ఆరింటికి ఆమోదం లభించిందని, 29 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానమిచ్చామని బిర్లా చెప్పారు. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయబడింది.58 రోజులు సమావేశాలు ఉండడంతో 17వ లోక్సభ 331 రోజుల కంటే ఎక్కువసేపు జరిగే అవకాశం లేదు. 1952 తర్వాత ఇది ఆరవ అతి తక్కువ బడ్జెట్ సెషన్.
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి