Jagadish Shettar: కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం.. కన్నీటి పర్యంతమైన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈరోజు కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో జగదీష్ షెట్టర్ సతీమణి శిల్పా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఏడుస్తూ కనిపించారు. ఆమెను షెట్టర్ ఓదార్చడానికి ప్రయత్నించారు. మద్దతుదారులు షెట్టర్ కు అభినందనలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ రేకుల వర్షం కురిపించారు.
Also Read: Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు
మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. దీంతో అధిష్టా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి్ గురయిన షెట్టర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోజుల తరబడి బిజెపి అగ్రనేతలతో సమావేశాలు జరిపిన తరువాత షెట్టర్ కాంగ్రెస్ లో చేరాని నిర్ణయించుకున్నారు. కర్ణాటకలోని లింగాయత్ సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఉన్న షెట్టర్.. తన సొంత నియోజకవర్గం హుబ్బలి-ధార్వాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
సీనియర్ నాయకుడనైన తనకు బీజేపీ టికెట్ ఇస్తుందని అనుకున్నాను..కానీ నాకు దక్కడం లేదని తెలియగానే షాక్కు గురయ్యాను అని జగదీష్ షెట్టర్ అన్నారు. ఎవరూ తనతో మాట్లాడలేదని, తనను ఒప్పించే ప్రయత్నం చేయలేదని కాంగ్రెస్లో చేరిన తర్వాత షెట్టర్ విలేకరులతో అన్నారు. తనకు టికెట్ నిరాకరించినప్పుడు బిజెపి నాయకత్వం తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని షెట్టర్ అన్నారు.
Also Read:Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..
తాను నిర్మించిన పార్టీతో తనపట్ల దారుణంగా ప్రవర్తించారని, బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలో చేరుతున్నానని షెట్టర్ ప్రకటించారు. కాగా, షెట్టర్ గతంలో ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్ను ఓడించి 21,000 ఓట్లకు పైగా గెలుపొందారు. కాగా, కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!