Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకు కేరాఫ్ గా మారుతోంది. ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు, ఆయన కుమారుడి ఎన్ కౌంటర్ ఘటన మరువక ముందే మరో దారణం జరిగింది. జలాన్ జిల్లాలో ఈరోజు ఉదయం కళాశాల పరీక్షకు హాజరై తిరిగి వస్తున్న యువతిని మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
Also Read:CM Jagan Lawyer : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కరెక్టుగా విచారణ జరుపలేదు..
బాధితురాలు రోష్ని అహిర్వార్ అనే 21 ఏళ్ల BA విద్యార్థిని ఉదయం 11 గంటల ప్రాంతంలో పరీక్ష ముగించుకుని రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా బజాజ్ పల్సర్ మోటార్సైకిల్పై ఇద్దరు వ్యక్తులు కంట్రీ మేడ్ పిస్టల్తో ఆమె వద్దకు వచ్చారు. వారిలో ఒకరు ఆమె తలపై కాల్చడంతో రోష్ని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఆ వ్యక్తులను పట్టుకునేందుకు పరుగెత్తారు, అయితే వారు ఆయుధాన్ని విసిరి వేగంగా వెళ్లిపోయారు.
Also Read
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
- Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడు ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితును ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగా రక్తపు మడుగులో నేలపై పడి ఉన్న యువతి యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యువతి కళాశాల యూనిఫాంలో ఉంది. ఆమె పక్కన నేలపై పిస్టల్ కనిపిస్తుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు బీఏ సెకండ్ ఇయర్ విద్యార్థిని, కాలేజీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నట్లు జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఇరాజ్ రాజా తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ హత్యకు సంబంధించిన చాలా ఆధారాలు లభించాయని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Also Read:Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
ప్రయాగ్రాజ్లో గ్యాంగ్స్టర్-రాజకీయ అతిక్ అహ్మద్ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే తాజాగా మరో యువతిని తుపాకీతో కాల్చ చంపడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజావార్తలు
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
-
Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!