అత్యవసర సమావేశంపై కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యవసర బోర్డు సమావేశానికి సంబంధించి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు.. హైదరాబాద్ లోని జలసౌధలో జీఆర్ఎంబీకి చెందిన 10వ సమావేశం, కేఆర్ఎంబీకి చెందిన 13వ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు ప్రకటించాయి… కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోని వివిధ అంశాలను అమలు చేసేందుకు ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు వెల్లడించాయి బోర్డులు.. తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యులు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించిన గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు. గెజిట్ నోటిఫికేషన్ను అనుసరించి బోర్డుల్లో సభ్యుల నియామకాన్ని 30 రోజుల్లోగా చేపట్టాల్సి ఉందని దీనికి సంబంధించి ఏపీ త్వరలోనే సదరు సమాచారం ఇస్తామని ప్రకటించినట్టు వెల్లడించాయి.
గెజిట్ నోటిఫికేషన్లోని కొన్ని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేర్పులు ఉన్నాయని.. దీనిపై నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వెల్లడించిందని తన ప్రకటనలో పేర్కొన్నాయి రెండు బోర్డులు.. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన సీడ్ మనీ విషయంలో తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్టు ఏపీ సభ్యులు వెల్లడించారని.. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎఎస్ భద్రతా దళాల మొహరింపు అంశంపై కేంద్ర జలశక్తి శాఖ హోంశాఖలు పర్యవేక్షిస్తున్నాయని స్పష్టం చేశాయి.. కాగా, గెజిట్ నోటిఫికేషన్లోని అంశాల అమలుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహకరించాలని స్పష్టం చేసింది కృష్ణా నది, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఉమ్మడి బోర్డుల సమావేశం.
Also Read
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
తాజావార్తలు
-
Harish Rao: ఎల్నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!