కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ క్లాసులే.. విద్యాశాఖ మంత్రి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది… మొదటగా జులై 1వ తేదీ నుంచి ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు ఈనెల 25వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్తున్నారు.. అయితే.. ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆఫ్ లైన్ తరగతులు స్టార్ట్ చేయాలని అనుకున్న…. కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. కేజీ నుండి పీజీ వరకు ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు.. ఇక, డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని.. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు సబిత. మరోవైపు.. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందాపై స్పందించిన ఆమె.. 46 జీవోను అమలు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ కి మరో సారి చెబుతున్నాం… నెల వారిగా ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు.. దీనిపై ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.. ఇక, పరిస్థితిలు చక్కబడ్డాక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని.. ద్వితీయ సంవత్సరం ఫలితాలు క్రైటీరియా నచ్చక పోతే ఆ విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు విద్యాశాఖ మంత్రి.
కాగా, ఇవాళ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్టుగా ప్రకటించారు మంత్రి… ఉత్తీర్ణత సాధించినవారిలో 2,28,754 మంది బాలికలు, 2,22,831 బాలురు ఉన్నారు.. 1,76, 719 మంది ఏ గ్రేడ్, 1,04, 886 మంది బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 మంది డీ గ్రేడ్ సాధించారు.. మొదటి సంవత్సరం మార్కులనే ద్వితీయ సంవత్సరంకు వర్తింపజేశారు.. ప్రాక్టీకల్స్ మార్క్స్ మాత్రం అందరికి గరిష్టంగా కేటాయించారు. గతంలో ఫెయిల్ అయిన వారికి 35శాతం మార్కులతో పాస్ చేశారు.
Also Read
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!