మన దగ్గరే అనుకుంటే పొరపాటే..! అక్కడ కూడా నేతల తిట్ల పురాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కాస్తా శృతిమించి తిట్ల పురాణానికి దారితీస్తున్నాయి.. కొందరు నేతలైతే ఏకంగా రాయడానికి ఇబ్బందిగా ఉండే బూతులు తేలికగా మాట్లాడేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ నేత నోరు తెర్చినా.. బూతులు, సవాళ్లకు కొదవలేకుండా పోయింది. ఇక, ఎన్నికలు వస్తే చాలు.. నేతల బూతులతో టీవీలు మార్మోగుతున్నాయి. అయితే, ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అంటే పొరపాటే.. కర్ణాటకలో విధాన పరిషత్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. పనిలోపనిగా తిట్ల పురాణం అందుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్: దేశం విడిచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్..!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజాగా, మంత్రి కేఎస్ ఈశ్వరప్పను పనికిమాలిన దద్దమ్మ అంటూ ప్రతిపక్ష నేత సిద్దరామయ్య మండిపడితే.. దీనిపై ఘాటుగా స్పందించిన ఆయన.. కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యను పచ్చితాగుబోతుగా పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు తాగుతాడో తాగిన మత్తులో ఏం మాట్లాడుతారో తెలియదని వ్యాఖ్యానించారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ను ఉగ్రవాది అంటూ ఆరోపించిన సిద్దరామయ్య.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో తాను కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలవి తిట్లు కానప్పుడు తనవి మాత్రం ఎలా? అవుతాయని ఎదురుప్రశ్నిస్తున్నారు. ఇక, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ రూపొందించారంటూ మాజీ ఎంపీ అనిల్ లాడ్ చేసిన వ్యాఖ్యలకు కూడా దుమారాన్నే రేపాయి.. వెంటనే అనిల్ లాడ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాదు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటీల్ను ఉగ్రవాదిగా సంబోధించినందుకు సిద్దరామయ్యపై కూడా కంప్లైంట్ చేశారు. ఇలా కర్ణాటకలోనూ నేతల మధ్య తిట్ల దండకం కొనసాగుతోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!