Nara Lokesh: పిల్లలే మన భవిష్యత్తు.. వారిని తీర్చిదిద్దేది విద్యే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: పిల్లలే మన భవిష్యత్తు.. వారిని తీర్చిదిద్దేది మాత్రం విద్యే అన్నారు మంత్రి నారా లోకేష్.. శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో ప్రజావేదికపై నిర్వహించారు.. ఉత్తరాంధ్రలోని భామినిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యే అసలైన పునాది అని, అందుకే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజం మనకోసం చాలా చేస్తుంది.. మనం కూడా సమాజానికి ఏదైనా చేయాలి అన్న మాటలు కారా మాస్టార్ వంటి మహనీయుల వల్లే మనలో నాటుకుపోయాయి. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కారా మాస్టార్ సేవలను ఎప్పటికీ స్మరించుకోవాలి అన్నారు.
విద్యాశాఖ మంత్రిగా వచ్చాక మొదటి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమేనని లోకేష్ పేర్కొన్నారు.“పేరెంట్–టీచర్ మీటింగ్ల ద్వారా తల్లిదండ్రులను నేరుగా విద్యా వ్యవస్థతో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాష్ట్రంలో మూడో పెద్ద మీటింగ్” అన్నారు. పిల్లలే మన భవిష్యత్తు. వారికి విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించటం ఎంతో ముఖ్యం. పిల్లలు అద్భుతంగా మాట్లాడుతున్నారు… వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది” అని చెప్పారు. ఒక తల్లి పట్టుచీరను తాకట్టు పెట్టి చదివించిన తన కుమారుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు రాష్ట్రానికి గొప్ప నాయకుడయ్యారని ఉదాహరణగా చెప్పారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ ర్యాంకును అంగీకరించకపోయినా, విద్య, నైతికతలపై సమాజాన్ని విద్యావంతం చేస్తున్నారని ప్రశంసించారు.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
పాఠశాలల్లో రాజకీయాలకు చోటు ఉండదని, ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఓ రేంజ్లోకి తీసుకువెళ్తాం.. రాష్ట్రంలో 906 సింగిల్ టీచర్ పాఠశాలలను ఏర్పాటు చేశామని..ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని.. లీప్ యాప్ ద్వారా పిల్లల మార్కులు, హాజరు, ఉపాధ్యాయులు, ఇతర అకడమిక్ వివరాలు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి తల్లిదండ్రి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు చాలా కీలకం అన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!