Nara Lokesh: పిల్లలే మన భవిష్యత్తు.. వారిని తీర్చిదిద్దేది విద్యే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: పిల్లలే మన భవిష్యత్తు.. వారిని తీర్చిదిద్దేది మాత్రం విద్యే అన్నారు మంత్రి నారా లోకేష్.. శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో ప్రజావేదికపై నిర్వహించారు.. ఉత్తరాంధ్రలోని భామినిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యే అసలైన పునాది అని, అందుకే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజం మనకోసం చాలా చేస్తుంది.. మనం కూడా సమాజానికి ఏదైనా చేయాలి అన్న మాటలు కారా మాస్టార్ వంటి మహనీయుల వల్లే మనలో నాటుకుపోయాయి. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కారా మాస్టార్ సేవలను ఎప్పటికీ స్మరించుకోవాలి అన్నారు.
విద్యాశాఖ మంత్రిగా వచ్చాక మొదటి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమేనని లోకేష్ పేర్కొన్నారు.“పేరెంట్–టీచర్ మీటింగ్ల ద్వారా తల్లిదండ్రులను నేరుగా విద్యా వ్యవస్థతో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాష్ట్రంలో మూడో పెద్ద మీటింగ్” అన్నారు. పిల్లలే మన భవిష్యత్తు. వారికి విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించటం ఎంతో ముఖ్యం. పిల్లలు అద్భుతంగా మాట్లాడుతున్నారు… వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది” అని చెప్పారు. ఒక తల్లి పట్టుచీరను తాకట్టు పెట్టి చదివించిన తన కుమారుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు రాష్ట్రానికి గొప్ప నాయకుడయ్యారని ఉదాహరణగా చెప్పారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ ర్యాంకును అంగీకరించకపోయినా, విద్య, నైతికతలపై సమాజాన్ని విద్యావంతం చేస్తున్నారని ప్రశంసించారు.
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
పాఠశాలల్లో రాజకీయాలకు చోటు ఉండదని, ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఓ రేంజ్లోకి తీసుకువెళ్తాం.. రాష్ట్రంలో 906 సింగిల్ టీచర్ పాఠశాలలను ఏర్పాటు చేశామని..ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని.. లీప్ యాప్ ద్వారా పిల్లల మార్కులు, హాజరు, ఉపాధ్యాయులు, ఇతర అకడమిక్ వివరాలు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి తల్లిదండ్రి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు చాలా కీలకం అన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
-
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!