అందరికీ ఫ్రీ వ్యాక్సిన్.. ట్రెండింగ్లో జస్టిస్ చంద్రచూడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడి కోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్.. అయితే, కేంద్రం వ్యాక్సినేషన్ విధానంపై ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు.. ఓవైపు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు, ప్రతిపక్షాల డిమాండ్లు, ఇంకోవైపు సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. దీంతో కేంద్రం దిగిరాకతప్పలేదు.. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అంటూ.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.. రాష్ట్రాలు ఒక్కరూపాయి కూడా వ్యాక్సిన్లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని.. 75 శాతం రాష్ట్రాలకు సరఫరా చేస్తే.. 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇక, ప్రధాని మోడీ ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆ పార్టీ నేతలు స్వాగతిస్తుంటే.. సుప్రీంకోర్టు మందలించడంతోనే ఆలస్యంగా ఈ ప్రకటన చేశారని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి.. ఉచిత వ్యాక్సినేషన్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులతోనే ప్రధాని మోడీ స్పందించారని, ఈ నిర్ణయం ప్రకటించేందుకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు..
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత సుప్రీంకోర్టుపై.. జస్టిస్ చంద్రచూడ్పై ప్రశంసలు కురుస్తున్నాయి.. కేంద్రం వ్యాక్సినేషన్ విధానంలోని లోపాలను జస్టిస్ చంద్రచూడ్ ఎండగట్టడంతోనే ఇది సాధ్యమైందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. జస్టిస్ చంద్రచూడ్కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.. దీంతో.. ఓ దశలో ట్రెండింగ్లోకి వచ్చారు చంద్రచూడ్.. సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆదేశాలను తరువాతి రోజు మీడియా రిపోర్ట్ చేసిన తీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేసిందంటున్నారు విశ్లేషకులు.. వ్యాక్సిన్ సంబంధించిన నోటింగ్స్తో సహా మొత్తం ఫైల్స్ను తమ ముందు ఉంచమని సుప్రీం కోర్టు చెప్పడంతో.. ఇక, వ్యాక్సిన్ బాధ్యతను కేంద్రం చేతిలోకి తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాల్సి వచ్చిందని.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..
Also Read
తాజావార్తలు
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
-
Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
-
Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!