వైరల్ అవుతున్న లాన్స్ నాయక్ సాయితేజ చివరి మెసేజ్
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ.
”హ్యాపీగా ఉండు.. Happy ga undu” అంటూ పంపిన సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 4 గంటల ముందు ఈ సందేశం భార్యకు చేరింది. ఒకరోజు ముందు మదనపల్లిలో వున్న భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడారు సాయితేజ. పిల్లలతో మాట్లాడే టైం లేదని బాస్తో కలిసి టూర్కి వెళుతున్నామని మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం 8.45కి వీడియో కాల్ చేశారు సాయితేజ. బాస్ కార్యక్రమం అయ్యాక సాయంత్రం ఢిల్లీనుంచి ఫోన్ చేస్తానని, పిల్లలతో మాట్లాడించాలని సాయితేజ కోరారు. అది జరగకుండానే సాయితేజ తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు ఈ అమరసైనికుడు.
Also Read
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
భర్త మాట్లాడిన మాటల్ని గుర్తుచేసుకుంటూ.. కన్నీటి పర్యంతం అవుతోంది భార్య శ్యామల. నాన్న ఎప్పుడు వస్తారు.. అని అడిగే తన పిల్లలకు తానేం చెప్పాలని ఆమె మౌనంగా రోధిస్తోంది. ”పిల్లలమీద బాగా ధ్యానం తిరిగింది.. జనవరిలో వచ్చి వారితో గడుపుతాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో “అంటూ భార్యను ఫోన్లో ఓదార్చారు సాయితేజ. అవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు భార్య నేత్రాలు కన్నీటి చెలమలవుతున్నాయి. సంక్రాంతికి తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని భావించారు సాయితేజ.
రేగడివారి పల్లెకు చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతుల ఇద్దరు సంతానంలో పెద్దవాడు సాయితేజ. అతని తమ్ముడు కూడా సైన్యంలో వున్నాడు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు సాయితేజ రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది.
రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు అందరితో ఆప్యాయంగా మెలిగేవాడని చెబుతున్నారు. ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసిన వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. అతని అంకితభావమే సీడీఎస్ దగ్గర పనిచేసే అవకాశాన్ని కల్పించిందని, తన బాస్తో పాటు సాయి తేజ కూడా తిరిగి రాని లోకాలకు చేరిపోయాడని కుటుంబసభ్యులు, ఆర్మీ స్టాఫ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తాజావార్తలు
-
Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
-
PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
-
Dacoit OTT Release Date: అడివి శేష్ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
-
KKR Vs SRH: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. పట్టుబిగించిన కేకేఆర్..
-
AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!