వైరల్ అవుతున్న లాన్స్ నాయక్ సాయితేజ చివరి మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ.
”హ్యాపీగా ఉండు.. Happy ga undu” అంటూ పంపిన సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 4 గంటల ముందు ఈ సందేశం భార్యకు చేరింది. ఒకరోజు ముందు మదనపల్లిలో వున్న భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడారు సాయితేజ. పిల్లలతో మాట్లాడే టైం లేదని బాస్తో కలిసి టూర్కి వెళుతున్నామని మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం 8.45కి వీడియో కాల్ చేశారు సాయితేజ. బాస్ కార్యక్రమం అయ్యాక సాయంత్రం ఢిల్లీనుంచి ఫోన్ చేస్తానని, పిల్లలతో మాట్లాడించాలని సాయితేజ కోరారు. అది జరగకుండానే సాయితేజ తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు ఈ అమరసైనికుడు.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
భర్త మాట్లాడిన మాటల్ని గుర్తుచేసుకుంటూ.. కన్నీటి పర్యంతం అవుతోంది భార్య శ్యామల. నాన్న ఎప్పుడు వస్తారు.. అని అడిగే తన పిల్లలకు తానేం చెప్పాలని ఆమె మౌనంగా రోధిస్తోంది. ”పిల్లలమీద బాగా ధ్యానం తిరిగింది.. జనవరిలో వచ్చి వారితో గడుపుతాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో “అంటూ భార్యను ఫోన్లో ఓదార్చారు సాయితేజ. అవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు భార్య నేత్రాలు కన్నీటి చెలమలవుతున్నాయి. సంక్రాంతికి తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని భావించారు సాయితేజ.
రేగడివారి పల్లెకు చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతుల ఇద్దరు సంతానంలో పెద్దవాడు సాయితేజ. అతని తమ్ముడు కూడా సైన్యంలో వున్నాడు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు సాయితేజ రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది.
రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు అందరితో ఆప్యాయంగా మెలిగేవాడని చెబుతున్నారు. ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసిన వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. అతని అంకితభావమే సీడీఎస్ దగ్గర పనిచేసే అవకాశాన్ని కల్పించిందని, తన బాస్తో పాటు సాయి తేజ కూడా తిరిగి రాని లోకాలకు చేరిపోయాడని కుటుంబసభ్యులు, ఆర్మీ స్టాఫ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!