Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Is Modi Government Plan To Decrease The Petrol Price

పెట్రోల్ ధరలపై ‘మ్యాజిక్’ చేయబోతున్న కేంద్ర సర్కార్?

Published Date :October 19, 2021 , 5:57 pm
By Manohar
పెట్రోల్ ధరలపై ‘మ్యాజిక్’ చేయబోతున్న కేంద్ర సర్కార్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా ఎంట్రీతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెల్సిందే. గత రెండుళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనా దాటికి లక్షలాది మంది మృత్యువాతపడగా, కోట్లాది మంది ఉద్యోగాల్లేక వీధిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వారిపై మరింత పన్నుల భారం మోపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.

చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులపై ఇష్టారీతిన పన్నులు పెంచుకుంటూ పోతుంది. దీంతో నిత్యావసర ధరల పెరుగుదలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. కొన్ని నెలలుగా పెట్రోల్ ధరలు పెరగడమేగానీ తగ్గిన దాఖలాలు లేవు. ప్రతీరోజు 20పైసలు, 30పైసలు, 50పైసల చొప్పున ధరల చొప్పున ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. జేబులకు చిల్లుపడింది కూడా తెలియకుండానే సామాన్యుడి నడ్డిని విరుస్తోంది.

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

ఇప్పటికే పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీని దాటేశాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.110 ఉండగా డిజీల్ ధరలు రూ.103గా ఉంది. ముఖ్య పట్టణాల్లో ఈ రేటు ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు కూడా ప్రతీనెలా మారుతున్నాయి. ప్రస్తుతం వంట గ్యాస్ ధరకు వెయ్యి రూపాయాలకు అటూ ఇటుగా ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా సామాన్యుడిపై ప్రభావం చూపుతున్నాయి. అసలే పనుల్లేక పస్తులుంటున్న జనాలపై పెట్రో ఉత్పత్తుల పేరిట పన్నులను పెంచడం శోచనీయంగా మారింది.

కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది సామాన్యుడికి ఏమేరకు అందిందో తెలియదు గానీ పెట్రో ధరల పెరుగుదలతో సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడుతోంది. పెట్రోల్, డిజీల్ ధరలు అందన ఎత్తులోకి వెళ్లిపోవడంతో మోదీ సర్కారుపై ప్రజల్లో ఒక్కింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మోదీ ఇమేజ్ క్రమంగా మసకబారుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలపై మోదీ సర్కార్ సైతం బెంబేలెత్తిపోతుంది.

ఇక త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో మోదీ సర్కార్ అలర్ట్ అవుతోంది. పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదల సామాన్యులపై ప్రభావం చూపుతుండటంతో ఆ వ్యతిరేకత వచ్చే ఎన్నికలపై పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్ ధరలకు కళ్లెంవేసేలా కేంద్ర ఆర్ధిక శాఖ పెట్రోలియం శాఖతో సంప్రదింపులు చేస్తోంది. పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలపై పన్నులు తగ్గించి సాధారణ స్థితికి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తోంది.

దీనికితోడు ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేలా కొత్తకొత్త హామీలు ఇచ్చేందుకు మోదీ సర్కారు రెడీ అవుతోంది. అయితే ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గించినా ఎన్నికల తర్వాత మళ్లీ పెరగడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా గత కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల పెరుగుదలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కళ్లెం వేయనుండటం ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ప్రజలను మభ్యపెట్టేలా కేంద్ర సర్కారు చేయబోయే మాయజాలం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • modi
  • Modi government
  • petrol price
  • PM Modi

తాజావార్తలు

  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

  • SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!

  • Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions