పవన్ విమర్శలకు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం ఎలాంటి ముగింపు ఇస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపైనే దృష్టిపెట్టారు. ప్రజల సంక్షేమమే ఏజెండాగా ముందుకెళుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు. ప్రజలు జగన్ వైపు ఉన్నారనడానికి కిందటి స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనంగా కన్పిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తూ వెళుతోంది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీస పోటీ ఇవ్వని దుస్థితి నెలకొంది.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. కానీ అధికారంలోకి వచ్చాక చాలా వరకు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రతిపక్ష పార్టీలకు పెద్దగా కౌంటర్ ఇవ్వడం లేదు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొడుతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లలో పవన్ కల్యాణ్ పై ఒకటి రెండుసార్లు మినహా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోవడం, ఆపార్టీకి ఒకటే సీటు రావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ పార్టీని ఆయన లైట్ తీసుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా వైసీపీ సర్కారును టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఆయన మాటల్ని తిప్పుకొడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ జగన్ మార్క్ ముగింపు పలుకే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. పవన్ విమర్శలపై సీఎం జగన్ త్వరలోనే స్పందించే అవకాశాలు కన్పిస్తోంది.
పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఓసారి కామెంట్ చేస్తే ఇప్పటికీ ఆయన నానాయాగి చేస్తున్నాడు. జగన్ ఒకసారి ఆ మాటను పదేపదే చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు జనసేనాని. కాగా కొద్దిరోజులుగా సీఎం జగన్ పాలనపై తప్ప ఎవరీపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. కానీ జనసేనాని పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది. త్వరలో పవన్ ఇష్యూకు సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డు వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ విన్పిస్తుంది.
తాజావార్తలు
-
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
-
Jeep Meridian: భారత్లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్.. ధర ఎంతంటే?
-
Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
-
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
-
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!