జడ్జి హత్య కేసు… సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ జడ్జి హత్య కేసులో సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. అయితే, అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరచడం బాధాకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ఇక, జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ధన్బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును నిన్న స్వాధీనం చేసుకుంది సీబీఐ.. జూలై 28న మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయమూర్తి ఆనంద్ను ఆటోతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు. దీంతో.. సీబీఐ రంగంలోకి దిగింది.
మరోవైపు కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్ సుమోటోగా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును విచారణకు స్వీకరించింది.. ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రభుత్వ తరపున న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు.. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో సీబీఐకి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు… ఈ కేసు సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జడ్జిలకు వస్తున్న బెదిరింపులపై ఐబీకి గానీ, సీబీఐకి గానీ ఫిర్యాదు చేసినా.. అటువైపు నుంచి సానుకూలమైన స్పందన రావడంలేదన్నారు. ఇక, ఈ కేసులో వచ్చేవారం నుంచి పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్టు తెలిపారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
తాజావార్తలు
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!