Missing Indian Climber : ఆ పర్వతారోహకురాలు బ్రతికే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకురాలు సజీవంగా దొరికింది. బల్జీత్ కౌర్ అనే 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు ఈ రోజు సజీవంగా గుర్తించారు. ఆమె సమ్మిట్ పాయింట్ నుండి దిగుతుండగా అన్నపూర్ణ మౌంట్ IV క్యాంప్ సమీపంలో అదృశ్యమైన ఒక రోజు తర్వాత, ఆమె ఆచూకి లభించింది. పయనీర్ అడ్వెంచర్ పసాంగ్ షెర్పా చైర్మన్ క్యాంప్ IV పైన సోమవారం సప్లిమెంటల్ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన కౌర్ను వైమానిక శోధన బృందం గుర్తించింది. హై క్యాంప్ పై నుంచి ఆమెను ఎయిర్లిఫ్ట్ చేయడానికి లాంగ్-లైన్ రెస్క్యూ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పాడు.
Also Read:Digvijaya Singh: హిందువుల కంటే ముస్లిం ప్రజలనే హింసించింది.. అతిక్ గ్యాంగ్ పై దిగ్విజయ్ వ్యాఖ్య
ఏరియల్ సెర్చ్ టీమ్ ద్వారా బల్జీత్ కౌర్ క్యాంప్ IV వైపు ఒంటరిగా దిగుతూ కనిపించింది. శిఖరాగ్రానికి దిగువన ఒంటరిగా మిగిలిపోయిన పర్వతారోహకురాలు, ఈ ఉదయం వరకు జాడ కోసం అన్వేషించారు. రేడియో సంకేతాలతో ఆమోను గుర్తించేందుకు ప్రయత్నించారు. ఆమె తక్షణ సహాయం కోరుతూ రేడియో సిగ్నల్ను పంపగలిగిన తర్వాత మాత్రమే ఈ ఉదయం వైమానిక శోధన మిషన్ ప్రారంభించబడింది. జీపీఎస్ ఆధారంగా ఆమె 7,375m (24,193ft) ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె సోమవారం సాయంత్రం 5:15 గంటలకు ఇద్దరు షెర్పా గైడ్లతో కలిసి అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించింది. ఆమె జాడ కోసం కనీసం మూడు హెలికాప్టర్లను సమకూర్చారు. కాగా, గత ఏడాది మేలో, హిమాచల్ ప్రదేశ్కు చెందిన బల్జీత్ కౌర్, లొట్సే పర్వతాన్ని అధిరోహించి, ఒకే సీజన్లో నాలుగు 8000 మీటర్ల శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ అధిరోహకురాలిగా నిలిచారు.
Also Read:Stuck In Sudan: సూడాన్లో చిక్కుకున్న భారతీయులు.. 31 మంది కన్నడిగులు సురక్షితమేనా?
Also Read
సోమవారం, రాజస్థాన్లోని కిషన్గఢ్కు చెందిన అనురాగ్ మాలు అనే వ్యక్తి అన్నపూర్ణ పర్వతం III క్యాంప్ నుండి దిగుతుండగా అదృశ్యమయ్యాడు. క్యాంప్ IV నుండి దిగుతుండగా 6,000 మీటర్ల నుండి పడి మాలు మరణించాడు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్లో ఛైర్మన్ మింగ్మా షెర్పా తెలిపిన వివరాల ప్రకారం, వింటర్ సీజన్లో ఐర్లాండ్ నుండి K2 శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి నోయెల్ హన్నా, గత రాత్రి క్యాంప్ IVలో తుది శ్వాస విడిచారు. వారి మృతదేహాలను బేస్ క్యాంపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాగా, అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దాని ఆరోహణలో ప్రమాదమైందని ప్రసిద్ధి చెందింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..