Missing Indian Climber : ఆ పర్వతారోహకురాలు బ్రతికే ఉంది
నేపాల్లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకురాలు సజీవంగా దొరికింది. బల్జీత్ కౌర్ అనే 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు ఈ రోజు సజీవంగా గుర్తించారు. ఆమె సమ్మిట్ పాయింట్ నుండి దిగుతుండగా అన్నపూర్ణ మౌంట్ IV క్యాంప్ సమీపంలో అదృశ్యమైన ఒక రోజు తర్వాత, ఆమె ఆచూకి లభించింది. పయనీర్ అడ్వెంచర్ పసాంగ్ షెర్పా చైర్మన్ క్యాంప్ IV పైన సోమవారం సప్లిమెంటల్ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన కౌర్ను వైమానిక శోధన బృందం గుర్తించింది. హై క్యాంప్ పై నుంచి ఆమెను ఎయిర్లిఫ్ట్ చేయడానికి లాంగ్-లైన్ రెస్క్యూ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పాడు.
Also Read:Digvijaya Singh: హిందువుల కంటే ముస్లిం ప్రజలనే హింసించింది.. అతిక్ గ్యాంగ్ పై దిగ్విజయ్ వ్యాఖ్య
ఏరియల్ సెర్చ్ టీమ్ ద్వారా బల్జీత్ కౌర్ క్యాంప్ IV వైపు ఒంటరిగా దిగుతూ కనిపించింది. శిఖరాగ్రానికి దిగువన ఒంటరిగా మిగిలిపోయిన పర్వతారోహకురాలు, ఈ ఉదయం వరకు జాడ కోసం అన్వేషించారు. రేడియో సంకేతాలతో ఆమోను గుర్తించేందుకు ప్రయత్నించారు. ఆమె తక్షణ సహాయం కోరుతూ రేడియో సిగ్నల్ను పంపగలిగిన తర్వాత మాత్రమే ఈ ఉదయం వైమానిక శోధన మిషన్ ప్రారంభించబడింది. జీపీఎస్ ఆధారంగా ఆమె 7,375m (24,193ft) ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె సోమవారం సాయంత్రం 5:15 గంటలకు ఇద్దరు షెర్పా గైడ్లతో కలిసి అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించింది. ఆమె జాడ కోసం కనీసం మూడు హెలికాప్టర్లను సమకూర్చారు. కాగా, గత ఏడాది మేలో, హిమాచల్ ప్రదేశ్కు చెందిన బల్జీత్ కౌర్, లొట్సే పర్వతాన్ని అధిరోహించి, ఒకే సీజన్లో నాలుగు 8000 మీటర్ల శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ అధిరోహకురాలిగా నిలిచారు.
Also Read:Stuck In Sudan: సూడాన్లో చిక్కుకున్న భారతీయులు.. 31 మంది కన్నడిగులు సురక్షితమేనా?
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
సోమవారం, రాజస్థాన్లోని కిషన్గఢ్కు చెందిన అనురాగ్ మాలు అనే వ్యక్తి అన్నపూర్ణ పర్వతం III క్యాంప్ నుండి దిగుతుండగా అదృశ్యమయ్యాడు. క్యాంప్ IV నుండి దిగుతుండగా 6,000 మీటర్ల నుండి పడి మాలు మరణించాడు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్లో ఛైర్మన్ మింగ్మా షెర్పా తెలిపిన వివరాల ప్రకారం, వింటర్ సీజన్లో ఐర్లాండ్ నుండి K2 శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి నోయెల్ హన్నా, గత రాత్రి క్యాంప్ IVలో తుది శ్వాస విడిచారు. వారి మృతదేహాలను బేస్ క్యాంపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాగా, అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దాని ఆరోహణలో ప్రమాదమైందని ప్రసిద్ధి చెందింది.
తాజావార్తలు
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో