Missing Indian Climber : ఆ పర్వతారోహకురాలు బ్రతికే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకురాలు సజీవంగా దొరికింది. బల్జీత్ కౌర్ అనే 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు ఈ రోజు సజీవంగా గుర్తించారు. ఆమె సమ్మిట్ పాయింట్ నుండి దిగుతుండగా అన్నపూర్ణ మౌంట్ IV క్యాంప్ సమీపంలో అదృశ్యమైన ఒక రోజు తర్వాత, ఆమె ఆచూకి లభించింది. పయనీర్ అడ్వెంచర్ పసాంగ్ షెర్పా చైర్మన్ క్యాంప్ IV పైన సోమవారం సప్లిమెంటల్ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన కౌర్ను వైమానిక శోధన బృందం గుర్తించింది. హై క్యాంప్ పై నుంచి ఆమెను ఎయిర్లిఫ్ట్ చేయడానికి లాంగ్-లైన్ రెస్క్యూ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పాడు.
Also Read:Digvijaya Singh: హిందువుల కంటే ముస్లిం ప్రజలనే హింసించింది.. అతిక్ గ్యాంగ్ పై దిగ్విజయ్ వ్యాఖ్య
ఏరియల్ సెర్చ్ టీమ్ ద్వారా బల్జీత్ కౌర్ క్యాంప్ IV వైపు ఒంటరిగా దిగుతూ కనిపించింది. శిఖరాగ్రానికి దిగువన ఒంటరిగా మిగిలిపోయిన పర్వతారోహకురాలు, ఈ ఉదయం వరకు జాడ కోసం అన్వేషించారు. రేడియో సంకేతాలతో ఆమోను గుర్తించేందుకు ప్రయత్నించారు. ఆమె తక్షణ సహాయం కోరుతూ రేడియో సిగ్నల్ను పంపగలిగిన తర్వాత మాత్రమే ఈ ఉదయం వైమానిక శోధన మిషన్ ప్రారంభించబడింది. జీపీఎస్ ఆధారంగా ఆమె 7,375m (24,193ft) ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె సోమవారం సాయంత్రం 5:15 గంటలకు ఇద్దరు షెర్పా గైడ్లతో కలిసి అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించింది. ఆమె జాడ కోసం కనీసం మూడు హెలికాప్టర్లను సమకూర్చారు. కాగా, గత ఏడాది మేలో, హిమాచల్ ప్రదేశ్కు చెందిన బల్జీత్ కౌర్, లొట్సే పర్వతాన్ని అధిరోహించి, ఒకే సీజన్లో నాలుగు 8000 మీటర్ల శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ అధిరోహకురాలిగా నిలిచారు.
Also Read:Stuck In Sudan: సూడాన్లో చిక్కుకున్న భారతీయులు.. 31 మంది కన్నడిగులు సురక్షితమేనా?
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
సోమవారం, రాజస్థాన్లోని కిషన్గఢ్కు చెందిన అనురాగ్ మాలు అనే వ్యక్తి అన్నపూర్ణ పర్వతం III క్యాంప్ నుండి దిగుతుండగా అదృశ్యమయ్యాడు. క్యాంప్ IV నుండి దిగుతుండగా 6,000 మీటర్ల నుండి పడి మాలు మరణించాడు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్లో ఛైర్మన్ మింగ్మా షెర్పా తెలిపిన వివరాల ప్రకారం, వింటర్ సీజన్లో ఐర్లాండ్ నుండి K2 శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి నోయెల్ హన్నా, గత రాత్రి క్యాంప్ IVలో తుది శ్వాస విడిచారు. వారి మృతదేహాలను బేస్ క్యాంపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాగా, అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దాని ఆరోహణలో ప్రమాదమైందని ప్రసిద్ధి చెందింది.
తాజావార్తలు
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!