ఎన్నారైల సోషల్ మీడియా పోస్టులపై నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. విద్వేషపూరితంగా సందేశాల్ని వ్యాప్తి చేయటం.. ఫోటోల్ని మార్ఫింగ్ చేసే ఉదంతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమాయకుల ఫోటోల్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి.. అసభ్యకర పదజాలంతో పోస్టు చేస్తూ వేధింపులకు గురిచేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై కేసుల్ని నమోదు చేయటంతో పాటు.. వేగవంతంగా శిక్షలు పడేలా విచారణ సాగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
“సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నేరాలు చేసే వారిపై వచ్చే ఫిర్యాదుల మీద స్పందిస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు కానీ అలాంటి నిందితులపై చర్యలు తీసుకోవటంలో ఆలస్యం జరుగుతోందని, పూర్తి స్థాయిలో కేసులను వేగవంతంగా పరిశోధించి.. చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలి” అని పోలీసు అధికారుల్ని కోరారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ హెచ్ఓ.. ఏసీపీ.. డీసీపీ..జాయింట్ సీపీ.. అడిషనల్ సీపీతో సహా అన్ని విభాగాల పోలీసు అధికారులతో హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
సైబర్ నేరాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల విషయంలో అనుసరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల కేసుల నమోదులో ఉన్న వేగం.. వాటి విచారణ పూర్తి చేసి శిక్షలు పడే విషయంలో వెనుకబడి ఉన్న విషయాన్ని ప్రస్తావించిన సీపీ సి.వి. ఆనంద్.. ఆ దిశగా అధికారులు విచారణను వేగవంతం చేయాలన్నారు. కొందరు ఎన్.ఆర్ ఐలు సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేయొచ్చన్నారు.
అలాంటి వారి పాస్ పోర్టులు.. వీసాలను కూడా రద్దు చేయించవచ్చని చెప్పారు. వారు పెట్టిన ఫోటోల్ని.. వీడియోల్ని వెంటనే డిలీట్ చేయించాలన్నారు. అందుకు సంబంధించి సంబంధిత వర్గాలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వమని హైదరాబాద్ సీపీ కోరారు. అదే పనిగా నేరాలు చేసే అలవాటున్న నేరస్తులను గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు మిగిలిన వారు తప్పులు చేయటానికి జంకుతారని సీవీ శ్రీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ‘ఏదైనా కేసుల్లో అనుమానాలు ఉంటే వెంటనే లీగల్ అడ్వైజర్ సలహాలు సూచనలు తీసుకొని కేసుల్ని త్వరగా పరిష్కరించాలి. విచారణను వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి మీకు మీరుగా స్వయంగా చర్యలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
పై అధికారుల ఉత్తర్వుల కోసం వేచి చూడొద్దు. నేరాల్ని నిరూపించేందుకు అవసరమైన రీతిలో విచారణ పక్కాగా.. శాస్త్రీయంగా సాగాలి. ఆధారాల సేకరణకు అవసరమైన సాంకేతిక సాయాన్ని తీసుకోండి’ అని సీపీ సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు ప్రజలకు న్యాయం చేసేలా నడుచుకోవాలని.. ఎలాంటి అన్యాయాలకు తావు ఇవ్వొద్దని.. హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు. ప్రజలు ఆశించిన రీతిలో పోలీసింగ్ ఉండాలని.. సిబ్బంది పని తీరు అలా ఉండటం తప్పనిసరి అని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా రోడ్ల మీదనే ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీ సి.వి. ఆనంద్ అన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివోను పకడ్భందిగా అమలు చేయాలి. ప్రతి ఆఫీసులో, పోలీసు స్టేషన్లో వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. పార్టనా మందిరాలవద్ద, మా వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండ చూసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడి కోవిడ్ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వివరించాలన్నారు.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!