Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hyderabad Cv Anand Focus On Social Media Posts

ఎన్నారైల సోషల్ మీడియా పోస్టులపై నిఘా

Published Date :January 4, 2022 , 5:40 pm
By NTV WebDesk
ఎన్నారైల సోషల్ మీడియా పోస్టులపై నిఘా
  • Follow Us :
  • google news
  • dailyhunt

అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. విద్వేషపూరితంగా సందేశాల్ని వ్యాప్తి చేయటం.. ఫోటోల్ని మార్ఫింగ్ చేసే ఉదంతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమాయకుల ఫోటోల్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి.. అసభ్యకర పదజాలంతో పోస్టు చేస్తూ వేధింపులకు గురిచేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై కేసుల్ని నమోదు చేయటంతో పాటు.. వేగవంతంగా శిక్షలు పడేలా విచారణ సాగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

“సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నేరాలు చేసే వారిపై వచ్చే ఫిర్యాదుల మీద స్పందిస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు కానీ అలాంటి నిందితులపై చర్యలు తీసుకోవటంలో ఆలస్యం జరుగుతోందని, పూర్తి స్థాయిలో కేసులను వేగవంతంగా పరిశోధించి.. చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలి” అని పోలీసు అధికారుల్ని కోరారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ హెచ్ఓ.. ఏసీపీ.. డీసీపీ..జాయింట్ సీపీ.. అడిషనల్ సీపీతో సహా అన్ని విభాగాల పోలీసు అధికారులతో హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సైబర్ నేరాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల విషయంలో అనుసరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల కేసుల నమోదులో ఉన్న వేగం.. వాటి విచారణ పూర్తి చేసి శిక్షలు పడే విషయంలో వెనుకబడి ఉన్న విషయాన్ని ప్రస్తావించిన సీపీ సి.వి. ఆనంద్.. ఆ దిశగా అధికారులు విచారణను వేగవంతం చేయాలన్నారు. కొందరు ఎన్.ఆర్ ఐలు సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేయొచ్చన్నారు.

అలాంటి వారి పాస్ పోర్టులు.. వీసాలను కూడా రద్దు చేయించవచ్చని చెప్పారు. వారు పెట్టిన ఫోటోల్ని.. వీడియోల్ని వెంటనే డిలీట్ చేయించాలన్నారు. అందుకు సంబంధించి సంబంధిత వర్గాలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వమని హైదరాబాద్ సీపీ కోరారు. అదే పనిగా నేరాలు చేసే అలవాటున్న నేరస్తులను గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు మిగిలిన వారు తప్పులు చేయటానికి జంకుతారని సీవీ శ్రీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ‘ఏదైనా కేసుల్లో అనుమానాలు ఉంటే వెంటనే లీగల్ అడ్వైజర్ సలహాలు సూచనలు తీసుకొని కేసుల్ని త్వరగా పరిష్కరించాలి. విచారణను వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి మీకు మీరుగా స్వయంగా చర్యలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

పై అధికారుల ఉత్తర్వుల కోసం వేచి చూడొద్దు. నేరాల్ని నిరూపించేందుకు అవసరమైన రీతిలో విచారణ పక్కాగా.. శాస్త్రీయంగా సాగాలి. ఆధారాల సేకరణకు అవసరమైన సాంకేతిక సాయాన్ని తీసుకోండి’ అని సీపీ సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు ప్రజలకు న్యాయం చేసేలా నడుచుకోవాలని.. ఎలాంటి అన్యాయాలకు తావు ఇవ్వొద్దని.. హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు. ప్రజలు ఆశించిన రీతిలో పోలీసింగ్ ఉండాలని.. సిబ్బంది పని తీరు అలా ఉండటం తప్పనిసరి అని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా రోడ్ల మీదనే ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీ సి.వి. ఆనంద్ అన్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివోను పకడ్భందిగా అమలు చేయాలి. ప్రతి ఆఫీసులో, పోలీసు స్టేషన్లో వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. పార్టనా మందిరాలవద్ద, మా వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండ చూసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడి కోవిడ్ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వివరించాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • derogative statments
  • hyderabad cp
  • NRI Passports
  • social media Posts
  • social media videos

తాజావార్తలు

  • Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions