హుజురాబాద్లో కొనసాగుతోన్న పోలింగ్.. 20 కంపెనీల బలగాలతో భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొలిటికల్ హై ఓల్టేజ్ థ్రిల్లర్ హుజురాబాద్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 36వేల 283 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు లక్షా 17 వేల 563. మహిళా ఓటర్లు లక్ష18 వేల 719 మంది. ఎన్నికల నిర్వహణ కోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఈవీఎంలలో మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివిప్యాట్లను వినియోగిస్తున్నారు.. మొత్తం 1715 మంది పోలింగ్ సిబ్బంది బైపోల్ విధుల్లో బాగం పంచుకుంటున్నారు. హుజురాబాద్ జూనియర్ కాలేజిలో ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది అందరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల టీకా తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక, పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో మద్యం షాపులు, మద్యం విక్రయించే హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అభ్యర్థులు పబ్లిక్ లేదా ప్రైవేట్ స్థలాలలో 100 మీటర్లలోపు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్లలోపు ఎలాంటి ప్రచారం చెయ్యకూడదు. నియోజకవర్గంలో ఓటర్లందరికీ స్లిప్పులు పంపిణీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా వెంట తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ఇక, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారని పోలీసులు తెలిపారు. అసాంఘిక శక్తులుగా భావించిన వారిని బైండోవర్ చేశామని.. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 3,865 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను హుజురాబాద్ రప్పించారు. మొత్తం 30మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బందిలేకుండా అదనంగా 279 బ్యాలెట్లను సిద్ధం చేశారు. అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్తో పోలింగ్ కేంద్రాన్ని రికార్డ్ చేసేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణనిచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పోలింగ్ డ్యూటీ వేశారు. 306 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుండటంతో చీకటి పడిన తర్వాత విద్యుత్ సమస్య తలెత్తినా.. ఎలాంటి అవాంతరం లేకుండా ఉండేందుకు సోలార్ ల్యాంప్లు, చార్జింగ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!