Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Huge Competition For Ttd Board Membership

టీటీడీ బోర్డు సభ్యత్వం: బాప్ రే ఇంత పోటీనా?

Published Date :September 14, 2021 , 1:41 pm
By Manohar
టీటీడీ బోర్డు సభ్యత్వం: బాప్ రే ఇంత పోటీనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచంలో ఉన్న వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన భక్తజనం ఉన్నారు. వీరిందరికీ కూడా టీటీడీనే అన్నిరకాల వసతి, సదుపాయాలను కల్పిస్తోంది. ఈ పాలక మండలిలో సభ్యత్వం లభించిన వారికి నేరుగా శ్రీవారిని సేవించుకునే అవకాశం దక్కుతుంది. దీంతో టీటీడీ బోర్డులో స్థానం దక్కించుకునేందుకు రాజకీయ నేతల దగ్గరి నుంచి వ్యాపారులు, సంపన్నులు, సేవాపరులు పోటీపడుతూ ఉంటారు. ఇందులో చోటు దక్కడమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తుందంటారు. దీంతో ఈ పోస్టుకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ప్రతీ రెండేళ్లకోసారి టీటీడీ పాలకమండలి ఛైర్మన్ తోపాటు సభ్యులు మారుతూ ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా మరోసారి వైవీకే ఆ అదృష్టం దక్కింది. దీంతో కొత్తగా పాలక మండలి సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాలక మండలి సభ్యుల సంఖ్యను ప్రభుత్వం గతంలో 40కి పెంచింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగనుందనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహులు సైతం టీటీడీలో నామినేటేడ్ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read

  • Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
  • Emergency Alert: మీ మొబైల్స్‌ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
  • Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
  • Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ

ఈ పదవిని శ్రీవారికి సేవ చేసే కోణంలో ప్రభుత్వం చూస్తుండటంతో ఎక్కడా రాజకీయాలకు తావులేకుండా పదవుల పంపకం చేయాలని భావిస్తోంది. వివాదరహితంగా ఉండే వారిని గుర్తించి నియామకం చేపట్టాల్సి ఉండటంతో ప్రభుత్వం సైతం ఆమేరకు కసరత్తులు చేస్తుంది. ఇందుకోసం 60నుంచి 70మందితో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర మంత్రులు ఇచ్చిన సిఫార్సులు లేఖలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని జగన్ సర్కారు తుది జాబితాను రెడీ చేసేందుకు సిద్ధమవుతోంది.

గతంలో మాదిరిగానే టీటీడీ బోర్డులో సభ్యులను ఏపీ, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని ప్రభుత్వం నియమించనుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఏపీకి పంపించిన సిఫార్సులు లేఖలను జగన్ సర్కారు పరిశీలిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిన సిఫార్సులను యథావిధిగా అమలు చేస్తే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈసారి టీటీడీలో సభ్యుల సంఖ్యను పెంచే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి.

కేంద్ర మంత్రులు తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ వారిని నియమించాలని సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి నియామకాన్ని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉపయోగించుకునేలా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన జీఎస్టీ బకాయిలు.. పోలవరం నిధులు.. కొన్ని ప్రాజెక్టుల అనుమతులు.. ఆర్ధిక చేయూత వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని కొందరు కేంద్రమంత్రులు ఎంపిక చేసిన వారికి టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

దీనిలో భాగంగానే కొందరికీ సభ్యత్వం ఇవ్వగా.. మరికొందరినీ ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనా టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో జగన్ సర్కారు వీరి విషయంలో ఎలా ముందుకెళుతుందనే మాత్రం ఆసక్తిని రేపుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm jagan
  • huge competition
  • Tirupati
  • ttd
  • TTD Board Membership

తాజావార్తలు

  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

  • Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

  • NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?

  • MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions