అమిత్ షా నోట ముందస్తు ఎన్నికల మాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ పర్యాయం కూడా అటువంటి ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. తాజాగా అమిత్ షా కూడా ముందస్తు ముచ్చట చెప్పడంతో రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో బలమయిన శక్తిగా వున్న టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోందని, ధాన్యం అంశం అందుకు ఉదాహరణ అంటున్నారు. అందుకే మంచి వేడి మీద వున్నప్పుడే ఎన్నికలకు రెడీ కావాలని భావిస్తున్నారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు బాద్ షా అమిత్ షా. ‘ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ’ అని బీజేపీ-టీఆర్ఎస్ మధ్య దోస్తానా వుందని కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుని కొల్లగొట్టేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ కి గతంలో కంటే తక్కువ సీట్లే వచ్చేలా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు వీలున్నప్పుడల్లా మంత్రులతో విమర్శలు చేయిస్తున్నారు. ‘దళితబంధు’ పథకం పైనే కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పథకం కేసీఆర్కు రాజకీయంగా నష్టం చేస్తుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి.
మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభావం కూడా యువతపై వుంటుందని, ఇటీవల బీజేపీలో చేరిన విఠల్, తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కమలం వైపు మళ్ళిస్తారని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ అన్నీ ఆలోచించి వచ్చే ఏడాది చివరి నాటికి ఎన్నికలు వెళ్తారని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ లోపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం బీజేపీకి అత్యంత అవసరం. వచ్చే ఏడాది సాధ్యమయినన్ని ఎక్కువసార్లు బీజేపీ సభలు పెట్టి తెలంగాణలో వేడిని రాజేయడానికి సిద్దం అవుతున్నారు బీజేపీ నేతలు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ గడ్డమీద గులాబీ జెండా ఎగరేయాలని కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి బీజేపీ నేతలు ఎలాంటి వ్యూహంతో కారు స్పీడ్కి బ్రేక్ లు వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!