ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది… పరిపాలన చేతకానివాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్… కొంతమంది కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.. వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటు టీడీపీ నేతలు, శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. వైసీపీ నేతలు జెండా కర్రలతో టీడీపీ శ్రేణులపై దాడి చేసినట్టుగా వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది… ఈ సందర్భంగా టీడీపీ-వైసీపీ నేతల మధ్య పరస్పరం స్వల్ప దాడులు చోటుచేసుకున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్.. టీడీపీ నేత బుద్దా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఇరు వర్గాలను నచ్చజెప్పి.. అక్కడ నుంచి పంపిచే ప్రయత్నం చేశారు పోలీసులు.