భారతీయులు ఎక్కవుగా పర్యటించే థాయిలాండ్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గత కొన్ని నెల నుంచి కరోనా నేపథ్యంలో మూసి ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు, మసాజ్ సెంటర్లను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనాలో లోరిస్క్ దేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ లో రిస్క్ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ ప్రయాణికులు థాయిలాండ్ పర్యటనకు ఆ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కానీ.. 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు ఉండాలని లేకుంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకోని ఉండాలని సూచించింది. ఇవేవి లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్టు థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో చేసుకొని ఒక్కరోజు రిపోర్టు వచ్చేవరకు ఐసోలేషన్లో ఉండాలని నిబంధనలు విధించింది.