మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, ఈదురు గాలుల సమయంలో అప్పుడప్పుడు ఆకాశంలోనుంచి వడగళ్లు, చేపలు వంటివి కురుస్తుంటాయి. అయితే, ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలూకాలో ఓ రైతు పొలంలో పనిచేసుకుంటుండగా, ఒక్కసారిగి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఆకాశంలోనుంచి ఓ రాయి హటాత్తుగా ఈ రైతు పొలంలో పడింది. రైతుకు 8 అడుగుల దూరంలో పడిన ఆ రాయిని చూసి రైతు షాక్ అయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. రైతులు ఆ రాయిని పరిశీలించారు. ఆకాశం నుంచి రాలిపడిన శిలగా దానిని గుర్తించారు. అయితే, రంగు బంగారు వర్ణంలో ఉండటంతో స్వర్ణశిలగా పేర్కొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆ శిలను అప్పగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Read: ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన భారత్ !