ఏపీ సర్కార్ కు గన్నవరం చిక్కులు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది. గత రెండేళ్లుగా సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయి. మరోవైపు రాబోయే ఎన్నికలపై దృష్టిసారించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఎప్పుడు అవకాశం దొరకుతుందా? అని గోతికాడా నక్కలా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు గన్నవరం పోర్టు అంశం కలిసొచ్చినట్లు కన్పిస్తుంది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
గన్నవరం పోర్టులో ఏపీ సర్కారు వాటా 10.4శాతం ఉంది. అదానీ గ్రూప్ వాటా 51శాతంగా ఉంది. అతిపెద్ద వాటాదారుగా ఉన్న అదానీ గ్రూప్ ఇటీవల గన్నవరం పోర్టులో ఉన్న కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఏడాది డీవీఎష్ రాజు కుటుంబ సభ్యులకు గన్నవరం పోర్టులో ఉన్న వాటాను కొనుగోలు చేసింది. వీరితోపాటు మరికొన్ని వాటాలను ఆ సంస్థ చేజిక్కించుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం వాటాను కూడా అదానీ గ్రూపు దక్కించుకుంది. దీంతో గన్నవరం పోర్టులో అదానీ వాటా ఏకంగా 95శాతానికి చేరినట్లు తెలుస్తోంది. గన్నవరం పోర్టు దాదాపుగా ప్రైవేటీకరణతో సమానమని మేధావులు, నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ప్లాంట్ ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారు ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు అమ్మివేయడంపై విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్ నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబాళ్లపల్లికి చెందిన డాక్టర్ సత్య భూపాల్రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపడుతుండటంతో ప్రభుత్వం తన వాదనలు విన్పిస్తోంది.
గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకంపై ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టుకు వివరించారు. వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు వాటాల విక్రయాన్ని కూడా గన్నవరం పోర్టు విక్రయంతో కలపడాన్ని జగన్ సర్కార్ హైకోర్టులో వ్యతిరేకించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు లింకులు పెడుతూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు విశాఖ స్టీట్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేయాల్సి వస్తోంది. ఏదిఏమైనా గన్నవరం పోర్టు అంశం ఇప్పుడు ఏపీని రాజకీయంగా కుదిపివేస్తున్నట్లు కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!