ఏపీ సర్కార్ కు గన్నవరం చిక్కులు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది. గత రెండేళ్లుగా సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయి. మరోవైపు రాబోయే ఎన్నికలపై దృష్టిసారించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఎప్పుడు అవకాశం దొరకుతుందా? అని గోతికాడా నక్కలా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు గన్నవరం పోర్టు అంశం కలిసొచ్చినట్లు కన్పిస్తుంది.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
గన్నవరం పోర్టులో ఏపీ సర్కారు వాటా 10.4శాతం ఉంది. అదానీ గ్రూప్ వాటా 51శాతంగా ఉంది. అతిపెద్ద వాటాదారుగా ఉన్న అదానీ గ్రూప్ ఇటీవల గన్నవరం పోర్టులో ఉన్న కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఏడాది డీవీఎష్ రాజు కుటుంబ సభ్యులకు గన్నవరం పోర్టులో ఉన్న వాటాను కొనుగోలు చేసింది. వీరితోపాటు మరికొన్ని వాటాలను ఆ సంస్థ చేజిక్కించుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం వాటాను కూడా అదానీ గ్రూపు దక్కించుకుంది. దీంతో గన్నవరం పోర్టులో అదానీ వాటా ఏకంగా 95శాతానికి చేరినట్లు తెలుస్తోంది. గన్నవరం పోర్టు దాదాపుగా ప్రైవేటీకరణతో సమానమని మేధావులు, నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ప్లాంట్ ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారు ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు అమ్మివేయడంపై విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్ నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబాళ్లపల్లికి చెందిన డాక్టర్ సత్య భూపాల్రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపడుతుండటంతో ప్రభుత్వం తన వాదనలు విన్పిస్తోంది.
గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకంపై ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టుకు వివరించారు. వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు వాటాల విక్రయాన్ని కూడా గన్నవరం పోర్టు విక్రయంతో కలపడాన్ని జగన్ సర్కార్ హైకోర్టులో వ్యతిరేకించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు లింకులు పెడుతూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు విశాఖ స్టీట్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేయాల్సి వస్తోంది. ఏదిఏమైనా గన్నవరం పోర్టు అంశం ఇప్పుడు ఏపీని రాజకీయంగా కుదిపివేస్తున్నట్లు కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!