Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Gannavaram Implications For The Ap Government

ఏపీ సర్కార్ కు గన్నవరం చిక్కులు తప్పవా?

Published Date :September 11, 2021 , 1:47 pm
By Manohar
ఏపీ సర్కార్ కు గన్నవరం చిక్కులు తప్పవా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది. గత రెండేళ్లుగా సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయి. మరోవైపు రాబోయే ఎన్నికలపై దృష్టిసారించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఎప్పుడు అవకాశం దొరకుతుందా? అని గోతికాడా నక్కలా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు గన్నవరం పోర్టు అంశం కలిసొచ్చినట్లు కన్పిస్తుంది.

Also Read

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
Add as a preferred
source on google

గన్నవరం పోర్టులో ఏపీ సర్కారు వాటా 10.4శాతం ఉంది. అదానీ గ్రూప్ వాటా 51శాతంగా ఉంది. అతిపెద్ద వాటాదారుగా ఉన్న అదానీ గ్రూప్ ఇటీవల గన్నవరం పోర్టులో ఉన్న కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఏడాది డీవీఎష్ రాజు కుటుంబ సభ్యులకు గన్నవరం పోర్టులో ఉన్న వాటాను కొనుగోలు చేసింది. వీరితోపాటు మరికొన్ని వాటాలను ఆ సంస్థ చేజిక్కించుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం వాటాను కూడా అదానీ గ్రూపు దక్కించుకుంది. దీంతో గన్నవరం పోర్టులో అదానీ వాటా ఏకంగా 95శాతానికి చేరినట్లు తెలుస్తోంది. గన్నవరం పోర్టు దాదాపుగా ప్రైవేటీకరణతో సమానమని మేధావులు, నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ ప్లాంట్ ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారు ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు అమ్మివేయడంపై విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబాళ్లపల్లికి చెందిన డాక్టర్‌ సత్య భూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపడుతుండటంతో ప్రభుత్వం తన వాదనలు విన్పిస్తోంది.

గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకంపై ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టుకు వివరించారు. వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు వాటాల విక్రయాన్ని కూడా గన్నవరం పోర్టు విక్రయంతో కలపడాన్ని జగన్ సర్కార్ హైకోర్టులో వ్యతిరేకించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు లింకులు పెడుతూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు విశాఖ స్టీట్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేయాల్సి వస్తోంది. ఏదిఏమైనా గన్నవరం పోర్టు అంశం ఇప్పుడు ఏపీని రాజకీయంగా కుదిపివేస్తున్నట్లు కన్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • gannavaram
  • Gannavaram implications
  • implications

తాజావార్తలు

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions