ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జైలు రణరంగంగా మారింది. తోటి ఖైదీ మరణించిన వార్త విన్న ఖైదీలు ఆవేశంతో జైలు సిబ్బందిపై దాడికి దిగి జైలుకు నిప్పుపెట్టారు. అంతేకాకుండా జైలర్ను నిర్బంధించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సందీప్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు. ఈ మధ్య సందీప్ డెంగీ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సైఫాయి ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు.
ఈనేపథ్యంలో సైఫాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించారు. ఈ వార్త జైల్లో ఉన్న మిగితా ఖైదీలకు తెలియగానే జైలు వింధ్వంసం సృష్టించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో జైలుకు చేరుకున్న ఆధికారులను ఖైదీలు జైలు గేటు నిలిపివేశారు. అనంతరం పోలీసులు చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.