బూస్టర్ డోస్పై కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది.. ఇప్పటికే భారత్లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి.. కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని గుర్తించిన భారత్.. విస్తృస్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది.. రికార్డు స్థాయిలో 125 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. దీనికోసం ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్యానెల్ సమావేశం కానుంది.. ఈ సమావేశంలో బూస్టర్ డోస్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: ఒమిక్రాన్ టెన్షన్.. ఫిబ్రవరిలో తీవ్రరూపం..!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
అయితే, ప్రభుత్వం బూస్టర్ డోస్ను తన దృష్టిలో పెట్టుకోలేదు, ఎందుకంటే అర్హులందరికీ వీలైనంత వేగంగా రెండు డోసుల టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది.. కానీ, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు టెన్షన్ పెడుతుతోన్న నేపథ్యంలో.. కోవిడ్-19 ఇమ్యునైజేషన్పై భారతదేశ నిపుణుల ప్యానెల్ ఇవాళ సమావేశం అవుతోంది.. బూస్టర్ డోసు వేస్తే ఎలా ఉంటుంది? వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది.. ఈ ప్రక్రియ దశలవారీగా ఎలా అమలు చేయాలి, బూస్టర్ డోసు ఇస్తే.. అధిక ప్రమాదం ఉన్నవారికి ప్రాధాన్యత ఇద్దామా? లేదా అందరికీ ఇవ్వాలా? తదితర అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. అంతేకాదు.. 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్పై కూడా చర్చించనున్నారు.. ప్యానెల్ సభ్యుల మధ్య పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించడంపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, దశలవారీగా కసరత్తు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాక్సిన్కు ఏ పిల్లలు మొదట అర్హులో అనే విషయం తేల్చడంపై ప్రస్తుతం దృష్టి సారించారు నిపుణులు. పిల్లలకు టీకాలు వేయాలనే నిర్ణయం తొందరపడి తీసుకోబోమని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. మొత్తంగా ఇవాళ ఢిల్లీలో జరిగే వ్యాక్సినేషన్ ప్యానెల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..