వైరల్.. భారతీయుల టాలెంట్పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
150 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతిభకు ఏ మాత్రం కొదవ లేదు. అందుకే టెక్ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారు. తాజాగా ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భారతీయుల ఘనతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు గతంలో భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్లలో నియమింపబడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రారాజుగా వెలుగుతున్న ట్విట్టర్ సంస్థకు కూడా ఇండియాకు చెందిన వ్యక్తే సీఈవో అయ్యారని… టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు తమకు సాటెవ్వరూ రారని నిరూపించుకుంటున్నారని లాస్ ఏంజిల్స్కు చెందిన స్ట్రైప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొలిసన్ ఓ ట్వీట్ చేశారు.
Read Also: సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
దీంతో ఈ ట్వీట్కు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ రిప్లై ఇచ్చారు. భారతదేశంలోని ప్రతిభావంతుల నుంచి అమెరికా గొప్పగా ప్రయోజనం పొందుతుందని తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఎలన్ మస్క్ ట్వీట్ వైరల్ అవుతోంది. భూమిపై ఉన్న దేశాల్లో చాలామంది విద్యావంతులు ఉన్న ఏకైక దేశం భారత్ అని.. అమెరికాలోనే కాదు ఏ దేశంలోనైనా భారతీయులు తమ సత్తా చాటుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే.
USA benefits greatly from Indian talent!
— Elon Musk (@elonmusk) November 29, 2021
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!