పెరిగిన కాలుష్యం.. డేంజర్ జోన్ లో ఢిల్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది.
ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువుల సాంద్రత పెరగడం మూలంగా “ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 400 నుంచి 500 వరకు నమోదౌతోంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 457 గా నమోదైంది. గత మూడేళ్ళలో ఇది గరిష్టం అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఒక క్యూబిక్ మీటర్ లో 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువులు 457 ఉన్నట్లు లెక్క.
Also Read
ఇటు ఆందోళనలకు కేంద్రబిందువైన జంతర్ మంతర్ వద్ద ఎయుర్ క్వాలిటీ 341 ఉన్నట్లు నమోదయింది. ఆదివారం సాయంత్రం నుంచి క్రమేపి కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్న “సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్” తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 100 లోపు నమోదైతేనే దేశ రాజధాని పౌరులకు ఊరట కలిగే అవకాశం వుందంటున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 25 ఉంటేనే క్షేమకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఛాతి సమస్యలు, గుండె జబ్బులున్న వారికి ఈ కాలుష్యం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు.
“కోవిడ్-19” బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి కూడా ఈ కాలుష్యం ప్రాణాంతకం అని అంటున్నారు వైద్యులు. 10 నుంచి 15 శాతం బాలబాలికలు ఆస్థ్మా తో బాధపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందనిహెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రపంచంలోని అన్ని రాజధానుల్లో కెల్లా ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన “గాలి నాణ్యత” ఉన్న దేశ రాజధాని గా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పౌరులు ముంచుకొస్తున్న ప్రమాదకర పరిస్థితిని ఏ మాత్రం అర్ధం చేసుకోవడం లేదు. యధేచ్ఛగా అన్ని నిషేదాజ్ఞలను ఉల్లంఘించి “దీపావళి” క్రాకర్స్ ను కాల్చి విషతుల్యమైన కాలుష్యానికి కారణమౌతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ నిపుణులు.
తాజావార్తలు
-
TG TET 2026 Results: ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!