పెరిగిన కాలుష్యం.. డేంజర్ జోన్ లో ఢిల్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది.
ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువుల సాంద్రత పెరగడం మూలంగా “ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 400 నుంచి 500 వరకు నమోదౌతోంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 457 గా నమోదైంది. గత మూడేళ్ళలో ఇది గరిష్టం అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఒక క్యూబిక్ మీటర్ లో 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువులు 457 ఉన్నట్లు లెక్క.
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
ఇటు ఆందోళనలకు కేంద్రబిందువైన జంతర్ మంతర్ వద్ద ఎయుర్ క్వాలిటీ 341 ఉన్నట్లు నమోదయింది. ఆదివారం సాయంత్రం నుంచి క్రమేపి కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్న “సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్” తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 100 లోపు నమోదైతేనే దేశ రాజధాని పౌరులకు ఊరట కలిగే అవకాశం వుందంటున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 25 ఉంటేనే క్షేమకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఛాతి సమస్యలు, గుండె జబ్బులున్న వారికి ఈ కాలుష్యం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు.
“కోవిడ్-19” బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి కూడా ఈ కాలుష్యం ప్రాణాంతకం అని అంటున్నారు వైద్యులు. 10 నుంచి 15 శాతం బాలబాలికలు ఆస్థ్మా తో బాధపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందనిహెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రపంచంలోని అన్ని రాజధానుల్లో కెల్లా ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన “గాలి నాణ్యత” ఉన్న దేశ రాజధాని గా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పౌరులు ముంచుకొస్తున్న ప్రమాదకర పరిస్థితిని ఏ మాత్రం అర్ధం చేసుకోవడం లేదు. యధేచ్ఛగా అన్ని నిషేదాజ్ఞలను ఉల్లంఘించి “దీపావళి” క్రాకర్స్ ను కాల్చి విషతుల్యమైన కాలుష్యానికి కారణమౌతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ నిపుణులు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!