Covid Cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 4 నెలల్లో అత్యధికం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు నాలుగు నెలల్లో అత్యధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 800 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 841 కేసులు నమోదుకాగా.. 5,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు ఒక్కో మరణాన్ని నమోదు చేయగా, కేరళలో ఇద్దరి మహమ్మారికి బలైయ్యారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్లకు చేరింది.
Also Read: Google employees: గూగుల్ సీఈఓ పిచాయ్కి ఉద్యోగుల లేఖ
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లలో అత్యధికంగా వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ కేసులు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. ఒక నెల క్రితం (ఫిబ్రవరి 18) సగటు రోజువారీ కొత్త కేసులు 112 కాగా, ఇప్పుడు (మార్చి 18) 626కి పెరిగింది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.01 శాతం ఉన్నాయి. COVID-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161కి పెరిగింది.కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220.64 కోట్ల డోస్ల COVID-19 వ్యాక్సిన్ ఇవ్వబడింది. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5 లక్షల 30 వేల 799 మంది కరోనాతో మరణించారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ కు పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
మరోవైపు ఆకస్మికంగా కరోనా కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న వైరల్ ఇన్ఫెక్షన్ను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని కేంద్రం ఆరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖ రాశారు. పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, టీకాలు వేయడం లాంటి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!