విశాఖ కేజీహెచ్ పేరు మార్పు ఆలోచనపై రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH సేవలు ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాలకు విస్తరించాయి. ఆంధ్రామెడికల్ కాలేజ్ అనుబంధంగా పనిచేస్తున్నఆసుపత్రుల్లో అత్యంత ముఖ్యమైంది KGH. ఏటా ఇక్కడ వైద్యసేవలు పొందేవారి సంఖ్య లక్షల్లో వుం టుంది. కోవిడ్ తర్వాత ఈ ఆసుపత్రి ఖ్యాతి మరింత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రభుత్వ దవాఖానా చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే గుంటూరు జిన్నాటవర్ పంచాయతీ నడుస్తుండగా…ఇప్పుడు కేజీహెచ్ పేరు అంశం హాట్ టాపిక్ గా మా రింది. బ్రిటీష్ పరిపాలకుడు కింగ్ జార్జ్ స్ధానంలో ఉత్తరాంధ్రలో పోరాట యోధుల పేర్లను పెట్టాలనేది ఆయన డిమాండ్. వీర్రాజు కామెంట్ల పై ఘాటుగా స్పందించారు పురపాలకశాఖ మంత్రి బొత్స.
ఇప్పటి విశాఖ మహానగరం 1845లో కాలంలో చిన్న మత్స్యకార గ్రామం. ఇక్కడ ప్రజలకు అవసరమైన వైద్యసేవల కోసం సివిల్ డిస్పెన్సరీని ప్రారంభించింది బ్రిటీష్ ప్రభుత్వం. ఆ తర్వాత విద్య,వైద్యసేవలు విస్తరించగా… 1923లో ఆంధ్రా మెడికల్ కళాశాల ఏర్పాటైంది. డిస్పెన్సరీని ఎ.ఎమ్.సి.కి అనుసంధానించి ఆసుపత్రిగా విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కింగ్ జార్జ్-5 ఇండియాకు రావడంతో ఆయన గౌరవార్ధం ఆసుపత్రికి నామకరణం చేశారు. ఇది వందేళ్ళ క్రితం నాటి మాట.
తొలి ప్రిన్సిపల్ గా లెఫ్టెనెంట్ ఎఫ్.జె.ఆండ్రసన్ పనిచేయగా ..దాదాపు స్వాతంత్య్రం వచ్చే వరకు బ్రిటీష్ మిలట్రీ అధికారులే ఇక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత కేజీహెచ్ మరింత ప్రగతి సాధించింది. దశల వారీగా విస్తరించి ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేస్ధాయికి చేరింది. ఇటువంటి నేపథ్యం కలిగి, ప్రజాబాహుళ్యంకు సుపరిచితమైన పేరు మార్చాలనే డిమాండ్ వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప బీజేపీకి మరో ఆలోచన లేదంటు న్నాయి రాజకీయపార్టీలు.
కింగ్ జార్జ్ పేరు మార్పు డిమాండ్ ను ఉత్తరాంధ్ర బీజేపీ నాయకత్వం బాహాటంగా సమర్ధించుకోలేని పరిస్ధితి. ఈ ప్రాంతంలో మారుమూలకు వెళ్ళినా కేజీహెచ్ పేరు సుపరిచితం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక ప్యాకేజ్, రైల్వేజోన్ వంటి అంశాల గురించి మాట్లాడకుండా కేజీహెచ్ పేరును వివాదాస్పదం చేయడం రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నదేననే విమర్శలు వున్నాయి.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..