విశాఖ కేజీహెచ్ పేరు మార్పు ఆలోచనపై రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH సేవలు ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాలకు విస్తరించాయి. ఆంధ్రామెడికల్ కాలేజ్ అనుబంధంగా పనిచేస్తున్నఆసుపత్రుల్లో అత్యంత ముఖ్యమైంది KGH. ఏటా ఇక్కడ వైద్యసేవలు పొందేవారి సంఖ్య లక్షల్లో వుం టుంది. కోవిడ్ తర్వాత ఈ ఆసుపత్రి ఖ్యాతి మరింత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రభుత్వ దవాఖానా చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంది.
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే గుంటూరు జిన్నాటవర్ పంచాయతీ నడుస్తుండగా…ఇప్పుడు కేజీహెచ్ పేరు అంశం హాట్ టాపిక్ గా మా రింది. బ్రిటీష్ పరిపాలకుడు కింగ్ జార్జ్ స్ధానంలో ఉత్తరాంధ్రలో పోరాట యోధుల పేర్లను పెట్టాలనేది ఆయన డిమాండ్. వీర్రాజు కామెంట్ల పై ఘాటుగా స్పందించారు పురపాలకశాఖ మంత్రి బొత్స.
ఇప్పటి విశాఖ మహానగరం 1845లో కాలంలో చిన్న మత్స్యకార గ్రామం. ఇక్కడ ప్రజలకు అవసరమైన వైద్యసేవల కోసం సివిల్ డిస్పెన్సరీని ప్రారంభించింది బ్రిటీష్ ప్రభుత్వం. ఆ తర్వాత విద్య,వైద్యసేవలు విస్తరించగా… 1923లో ఆంధ్రా మెడికల్ కళాశాల ఏర్పాటైంది. డిస్పెన్సరీని ఎ.ఎమ్.సి.కి అనుసంధానించి ఆసుపత్రిగా విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కింగ్ జార్జ్-5 ఇండియాకు రావడంతో ఆయన గౌరవార్ధం ఆసుపత్రికి నామకరణం చేశారు. ఇది వందేళ్ళ క్రితం నాటి మాట.
తొలి ప్రిన్సిపల్ గా లెఫ్టెనెంట్ ఎఫ్.జె.ఆండ్రసన్ పనిచేయగా ..దాదాపు స్వాతంత్య్రం వచ్చే వరకు బ్రిటీష్ మిలట్రీ అధికారులే ఇక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత కేజీహెచ్ మరింత ప్రగతి సాధించింది. దశల వారీగా విస్తరించి ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేస్ధాయికి చేరింది. ఇటువంటి నేపథ్యం కలిగి, ప్రజాబాహుళ్యంకు సుపరిచితమైన పేరు మార్చాలనే డిమాండ్ వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప బీజేపీకి మరో ఆలోచన లేదంటు న్నాయి రాజకీయపార్టీలు.
కింగ్ జార్జ్ పేరు మార్పు డిమాండ్ ను ఉత్తరాంధ్ర బీజేపీ నాయకత్వం బాహాటంగా సమర్ధించుకోలేని పరిస్ధితి. ఈ ప్రాంతంలో మారుమూలకు వెళ్ళినా కేజీహెచ్ పేరు సుపరిచితం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక ప్యాకేజ్, రైల్వేజోన్ వంటి అంశాల గురించి మాట్లాడకుండా కేజీహెచ్ పేరును వివాదాస్పదం చేయడం రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నదేననే విమర్శలు వున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!