ఏపీ వైపు దూసుకొస్తున్న జవాద్ తుఫాన్.. కంట్రోల్రూంలు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరానికి తుఫాన్ చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్కు జవాద్గా నామకరణం చేసిన సంగతి విదితమే.
Read Also: ‘జవాద్’ ముప్పు.. ఆ జిల్లాల అధికారులకు కీలక సూచనలు
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
మరోవైపు తీవ్రవాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో శుక్రవారం నాడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈరోజు అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. శనివారం ఉదయం గంటకు 70-90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీంతో తీర ప్రాంత వాసులు ఊరూరా దండోరా వేసుకుని అప్రమత్తం చేసుకుంటున్నారు. అటు మండల కేంద్రాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.
జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ నాలుగే జిల్లాల్లో అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసి.. స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఈ నాలుగు జిల్లాలకు NDRF, SDRF బృందాలు ఇప్పటికే చేరుకోగా.. తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్ దండేను ప్రభుత్వం నియమించింది. తూర్పు గోదావరి జిల్లాకు జవాద్ తుఫాన్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్-18004253077, కాకినాడ ఆర్డీవో-0884-2368100, అమలాపురం ఆర్డీవో-08856-233208, రామచంద్రాపురం ఆర్డీవో-6304353706, పెద్దాపురం ఆర్డీవో-9603663227, రాజమహేంద్రవరం-0883-2442344, రంపచోడవరం-08864-243561, ఎటపాక-08864-285999.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!