ఇంధన ధరల మంట… చోటా ఎల్పీజీ సిలిండర్లకు పెరిగిన గిరాకీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. గ్యాస్ ధర కూడా భారీగా పెరిగిపోయింది.. అందరికీ విరివిగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత వరుసగా గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో వినియోగం కూడా తగ్గడం ప్రారంభమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి… అయితే, ఈ సమయంలో అనూహ్యంగా చోటా ఎల్పీజీ సిలిండర్లకు గిరాకీ పెరిగిపోయింది.. ధర పెరిగిపోవడంతో.. ఎల్పీజీ సిలిండర్ ప్రామాణిక 14.2 కిలోల వెర్షన్ కంటే 5 కిలోల సిలిండర్కు డిమాండ్ పెరిగింది.. ఒకేసారి పెద్ద సిలిండర్కు అయితే దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.. అదే చిన్న సిలిండర్ అయితే రూ.500 చెల్లిస్తే చాలు.. దీంతో.. చోటా సిలిండర్ తీసుకోవడానికే కొంతమంది ఇష్టపడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా వీటిని సరఫరా చేయాలనే ప్రణాళికలను ప్రభుత్వం వేస్తే మాత్రం చిన్న సిలిండర్ల వినియోగం మరింత పెరుగుతుందంటున్నారు. ఇక, పెద్ద ఎల్పీజీ సిలిండర్లకు ఎటువంటి సబ్సిడీ లేకపోవడం కూడా ఎక్కువ మంది వినియోగదారులు చిన్న సిలిండర్లకు మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రేషన్ షాపుల ద్వారా రిటైలింగ్ ప్రతిపాదనను ప్రశంసించాయి.. వారికి మద్దతును కూడా ఇచ్చాయి. రేషన్ దుకాణాల ద్వారా 5 కిలోల చిన్న సిలిండర్లను విక్రయించడానికి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) పరికరాలను ఉపయోగించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. మేం వ్యాపార నమూనాను పరిశీలిస్తున్నాం మరియు కేరళలో పైలట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రభుత్వ నిర్వహణలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఎఫ్ఈకి తెలిపింది. ప్రాథమిక చర్చలు మరియు ప్రతిపాదించిన వ్యాపార నమూనా ప్రకారం, FPS వద్ద చిన్న సిలిండర్ యొక్క రిటైల్ విక్రయ ధర మార్కెట్ ధరతో సమానంగా ఉంటుంది అని ఐవోసీ చెబుతోంది. 5 కిలోల చిన్న సిలిండర్ ప్రధానంగా వలస కూలీలు, విద్యార్థులు వాడుతుంటారు.. అడ్రస్ ప్రూఫ్ లేని కారణంగా బ్లాక్ మార్కెట్పై ఆధారపడిన ఆహార వ్యాపారులు మొదలైన వినియోగదారులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు.. ఈ చిన్న సిలిండర్ల విక్రయం 2020 డిసెంబర్లో ‘ఇందానే ఛోటు’ బ్రాండ్ పేరుతో మళ్లీ ప్రారంభించబడిన తర్వాత గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని అధికారులు చెబుతున్నారు.. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లపై సబ్సిడీలు నిలిపివేయబడినప్పుడు 2021లో 5 కిలోల గ్యాస్ అమ్మకాలు మరింత పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి… మొత్తంగా ఇంధన ధరల ప్రభావంతో.. ఎక్కువ ఖర్చు చేసే శక్తి లేక చాలా మంది 5 కిలోల గ్యాస్ వైపు మొగ్గు చూపుతున్నారని అధ్యయనంలో తేలింది.
Also Read
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
తాజావార్తలు
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
-
Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?