ఇంధన ధరల మంట… చోటా ఎల్పీజీ సిలిండర్లకు పెరిగిన గిరాకీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. గ్యాస్ ధర కూడా భారీగా పెరిగిపోయింది.. అందరికీ విరివిగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత వరుసగా గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో వినియోగం కూడా తగ్గడం ప్రారంభమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి… అయితే, ఈ సమయంలో అనూహ్యంగా చోటా ఎల్పీజీ సిలిండర్లకు గిరాకీ పెరిగిపోయింది.. ధర పెరిగిపోవడంతో.. ఎల్పీజీ సిలిండర్ ప్రామాణిక 14.2 కిలోల వెర్షన్ కంటే 5 కిలోల సిలిండర్కు డిమాండ్ పెరిగింది.. ఒకేసారి పెద్ద సిలిండర్కు అయితే దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.. అదే చిన్న సిలిండర్ అయితే రూ.500 చెల్లిస్తే చాలు.. దీంతో.. చోటా సిలిండర్ తీసుకోవడానికే కొంతమంది ఇష్టపడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా వీటిని సరఫరా చేయాలనే ప్రణాళికలను ప్రభుత్వం వేస్తే మాత్రం చిన్న సిలిండర్ల వినియోగం మరింత పెరుగుతుందంటున్నారు. ఇక, పెద్ద ఎల్పీజీ సిలిండర్లకు ఎటువంటి సబ్సిడీ లేకపోవడం కూడా ఎక్కువ మంది వినియోగదారులు చిన్న సిలిండర్లకు మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రేషన్ షాపుల ద్వారా రిటైలింగ్ ప్రతిపాదనను ప్రశంసించాయి.. వారికి మద్దతును కూడా ఇచ్చాయి. రేషన్ దుకాణాల ద్వారా 5 కిలోల చిన్న సిలిండర్లను విక్రయించడానికి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) పరికరాలను ఉపయోగించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. మేం వ్యాపార నమూనాను పరిశీలిస్తున్నాం మరియు కేరళలో పైలట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రభుత్వ నిర్వహణలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఎఫ్ఈకి తెలిపింది. ప్రాథమిక చర్చలు మరియు ప్రతిపాదించిన వ్యాపార నమూనా ప్రకారం, FPS వద్ద చిన్న సిలిండర్ యొక్క రిటైల్ విక్రయ ధర మార్కెట్ ధరతో సమానంగా ఉంటుంది అని ఐవోసీ చెబుతోంది. 5 కిలోల చిన్న సిలిండర్ ప్రధానంగా వలస కూలీలు, విద్యార్థులు వాడుతుంటారు.. అడ్రస్ ప్రూఫ్ లేని కారణంగా బ్లాక్ మార్కెట్పై ఆధారపడిన ఆహార వ్యాపారులు మొదలైన వినియోగదారులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు.. ఈ చిన్న సిలిండర్ల విక్రయం 2020 డిసెంబర్లో ‘ఇందానే ఛోటు’ బ్రాండ్ పేరుతో మళ్లీ ప్రారంభించబడిన తర్వాత గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని అధికారులు చెబుతున్నారు.. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లపై సబ్సిడీలు నిలిపివేయబడినప్పుడు 2021లో 5 కిలోల గ్యాస్ అమ్మకాలు మరింత పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి… మొత్తంగా ఇంధన ధరల ప్రభావంతో.. ఎక్కువ ఖర్చు చేసే శక్తి లేక చాలా మంది 5 కిలోల గ్యాస్ వైపు మొగ్గు చూపుతున్నారని అధ్యయనంలో తేలింది.
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!