ఇంధన ధరల మంట… చోటా ఎల్పీజీ సిలిండర్లకు పెరిగిన గిరాకీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. గ్యాస్ ధర కూడా భారీగా పెరిగిపోయింది.. అందరికీ విరివిగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత వరుసగా గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో వినియోగం కూడా తగ్గడం ప్రారంభమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి… అయితే, ఈ సమయంలో అనూహ్యంగా చోటా ఎల్పీజీ సిలిండర్లకు గిరాకీ పెరిగిపోయింది.. ధర పెరిగిపోవడంతో.. ఎల్పీజీ సిలిండర్ ప్రామాణిక 14.2 కిలోల వెర్షన్ కంటే 5 కిలోల సిలిండర్కు డిమాండ్ పెరిగింది.. ఒకేసారి పెద్ద సిలిండర్కు అయితే దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.. అదే చిన్న సిలిండర్ అయితే రూ.500 చెల్లిస్తే చాలు.. దీంతో.. చోటా సిలిండర్ తీసుకోవడానికే కొంతమంది ఇష్టపడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా వీటిని సరఫరా చేయాలనే ప్రణాళికలను ప్రభుత్వం వేస్తే మాత్రం చిన్న సిలిండర్ల వినియోగం మరింత పెరుగుతుందంటున్నారు. ఇక, పెద్ద ఎల్పీజీ సిలిండర్లకు ఎటువంటి సబ్సిడీ లేకపోవడం కూడా ఎక్కువ మంది వినియోగదారులు చిన్న సిలిండర్లకు మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రేషన్ షాపుల ద్వారా రిటైలింగ్ ప్రతిపాదనను ప్రశంసించాయి.. వారికి మద్దతును కూడా ఇచ్చాయి. రేషన్ దుకాణాల ద్వారా 5 కిలోల చిన్న సిలిండర్లను విక్రయించడానికి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) పరికరాలను ఉపయోగించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. మేం వ్యాపార నమూనాను పరిశీలిస్తున్నాం మరియు కేరళలో పైలట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రభుత్వ నిర్వహణలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఎఫ్ఈకి తెలిపింది. ప్రాథమిక చర్చలు మరియు ప్రతిపాదించిన వ్యాపార నమూనా ప్రకారం, FPS వద్ద చిన్న సిలిండర్ యొక్క రిటైల్ విక్రయ ధర మార్కెట్ ధరతో సమానంగా ఉంటుంది అని ఐవోసీ చెబుతోంది. 5 కిలోల చిన్న సిలిండర్ ప్రధానంగా వలస కూలీలు, విద్యార్థులు వాడుతుంటారు.. అడ్రస్ ప్రూఫ్ లేని కారణంగా బ్లాక్ మార్కెట్పై ఆధారపడిన ఆహార వ్యాపారులు మొదలైన వినియోగదారులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు.. ఈ చిన్న సిలిండర్ల విక్రయం 2020 డిసెంబర్లో ‘ఇందానే ఛోటు’ బ్రాండ్ పేరుతో మళ్లీ ప్రారంభించబడిన తర్వాత గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని అధికారులు చెబుతున్నారు.. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లపై సబ్సిడీలు నిలిపివేయబడినప్పుడు 2021లో 5 కిలోల గ్యాస్ అమ్మకాలు మరింత పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి… మొత్తంగా ఇంధన ధరల ప్రభావంతో.. ఎక్కువ ఖర్చు చేసే శక్తి లేక చాలా మంది 5 కిలోల గ్యాస్ వైపు మొగ్గు చూపుతున్నారని అధ్యయనంలో తేలింది.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!