ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు… 341, 323, 506 ఐసీపీ సెక్షన్ల కింద ముంతాజ్ ఖాన్పై కేసు బుక్ చేశారు హుస్సేనీ ఆలం పోలీసులు.. నిన్న అర్ధరాత్రి యువకుడి నమేస్తే కొట్టలేదాన్ని కారణంగా ముంతాజ్ ఖాన్ దాడి చేయడం.. ఆ యువకుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాతబస్తీ చార్మినార్ బస్టాండ్వద్ద గులామ్గౌస్జిలానీ అనే యువకుడు 12.43 గంటల సమయంలో తన ఇంటి దగ్గర అరుగు ముందు మరో వ్యక్తితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన చార్మినార్ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్తన గన్మెన్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. గులామ్గౌస్జిలాని వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్.. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా… నాకు సలామ్ పెట్టవా అంటూ దుర్భాషలాడాడు. మొదట తాను చూడలేదన్న సదరు యువకుడు.. ఆ తర్వాత అయినా ఎందుకు సలామ్ పెట్టాలి అంటూ ఎదురు ప్రశ్నించాడు.. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకునిపై చెంపదెబ్బలు కొట్టాడు.
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయండి.. ఈసీకి ఫిర్యాదు
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ఇక, ఎమ్మెల్యే గన్మెన్లు.. గులామ్గౌస్ జిలానీని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటికి మరో సారి ఎమ్మెల్యే సదరు యువకుడిపై దాడి చేశారు. ఇదంతా ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే జరిగింది.. ఆ తర్వాత క్షణాల్లో పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి యువకులు చేరుకోవడంతో.. చార్మినార్బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.. ఈ ఘటనలో బాధిత యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఇక, ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు బాధిత యువకుడు.. ఎమ్మెల్యే తనపై దాడి చేశారని.. తనను రివాల్వర్తో షూట్ చేస్తానని ఎమ్మెల్యే బంధువు బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. సీసీటీవీలో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేస్తున్నాయి.. రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి.. మొత్తంగా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!