Business Flash: పెరగలేని స్థితిలో.. పసిడి రేట్లు. అదిరే రేంజ్లో.. ‘అదానీ’ ప్లాన్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఒత్తిళ్లలో బంగారం మార్కెట్
అమెరికా ద్రవ్యోల్బణం భారీగా ఎగబాకటంతో ఇన్వెస్టర్లు బంగారంపై భరోసాతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొంది. గోల్డ్ రేటు కనీసం 100 బేసిస్ పాయింట్లయినా పెరుగుతుందనుకుంటే మార్కెట్ అనూహ్యంగా సుమారు 40 డాలర్లు నష్టపోయింది. పసిడి ధరలు నిన్న తిరిగి కోలుకునే తరుణంలో సైకలాజికల్ లెవల్ 1700 డాలర్ల తగ్గటం గమనార్హం.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ఏరో సిటీలపై అదానీ గ్రూప్ ఫోకస్
ఏరో సిటీల అభివృద్ధిపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. తన గ్రూపు అధీనంలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో వీటి ఏర్పాటుకు ప్లాన్లు వేస్తోంది. ‘సిటీ సైడ్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియా’ కింద ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. అదానీ గ్రూప్ కింద 500 పైగా ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీంతో అందులోని 70 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ వాణిజ్య సముదాయాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్మాణాల లిస్టులో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిటైల్స్, ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్ ఆప్షన్లు, లాజిస్టిక్స్, కమర్షియల్ ఆఫీసులు, అనుబంధ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లు ఉండటం విశేషం.
వివిధ కంపెనీల ఫలితాలు
సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లాభం ఏకంగా 60 శాతం పెరిగింది. ఆదాయ (రెవెన్యూ) వృద్ధి 15 శాతంగా నమోదైంది. ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. హెచ్సీఎల్ టెక్ సంస్థ ఫస్ట్ క్వార్టర్ (క్యూ1) రిజల్ట్స్ను డిక్లేర్ చేసింది. నికర లాభం 8.6 శాతం డౌన్ కావటంతో రూ.3,283 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లోనూ డివిడెంట్లను ప్రకటించటం చెప్పుకోదగ్గ విషయం. లాభం 634 కోట్లు తగ్గినట్లు ఎల్&టీ ఇన్ఫోటెక్ పేర్కొంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఈ వారాంతంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీలో మెటల్ సెక్టార్ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లూ నింగి వైపే చూస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్ స్టాక్స్కీ ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ మూడు సెక్టార్లకూ ఒక శాతం చొప్పున లాభాలు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..