బి.ఆర్.చోప్రా తొలిచిత్రం ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 7న ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు పూర్తి)
దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత బి.ఆర్.చోప్రా. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అఫ్సానా’. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘అఫ్సానా’ 1951 సెప్టెంబర్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి ఐ.ఎస్.జోహార్ కథ, మాటలు సమకూర్చారు. షదీలాల్ హండాతో కలసి బి.ఆర్.చోప్రా ఈ సినిమాను నిర్మించారు. త్రిభువన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
‘అఫ్సానా’ సినిమా కథ చదువుతున్నట్టుగానే చిత్రీకరించారు. టైటిల్ కార్డ్స్ సమయంలోనే ఓ చేయి పుస్తకం తిప్పుతూ ఉంటుంది. టైటిల్స్ పూర్తి కాగానే కవల సోదరులు రతన్, చమన్ , వారి నేస్తం మీరా కలసి నాటకం వేసే దృశ్యంతో చిత్రం మొదలవుతుంది. ఆ నాటకంలో ఇద్దరు కవలల్లో ఎవరు పెద్దవారు అనే దానిపై చర్చసాగి, ఓ విధూషకుడు వచ్చి ఆ చిక్కు ముడిని విప్పి రతన్ పెద్ద అని తేలుస్తాడు. ఇదే తీరున వారి జీవితం కూడా సాగడం విశేషం. ఓ ప్రదర్శనకు వెళ్ళిన రతన్, చమన్, మీరా విడిపోతారు. చమన్ , మీరా మిగులుతారు. రతన్ ఎక్కడిపోయాడో తెలియదు. మీరా మాత్రం రతన్ తిరిగి వస్తాడని వేచి ఉంటుంది. చమన్, రసిలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ గొడవలో చమన్ ఓ వ్యక్తిని చంపుతాడు. దాంతో చమన్ పరారీ అవుతాడు. అయితే అది ప్రమాదవశాన జరిగిన మరణం అని కోర్టు చమన్ ను విడుదల చేస్తుంది. అయితే వచ్చిన చమన్ లో తేడా కనిపిస్తుంది. అతనికి రసిలీ కంటే మీరా అంటే ఆసక్తి కలుగుతుంది. చివరకు రతన్ మిగిలాడని తేలిపోవడంతో కథ ముగుస్తుంది.
తొలి చిత్రంలోనే అశోక్ కుమార్ వంటి నాటి మేటి హీరోతో ద్విపాత్రాభినయం చేయించి, ఎంతగానో ఆకట్టుకున్నారు బి.ఆర్.చోప్రా. ఈ చిత్రంలో రతన్ కుమార్, జడ్జి అశోక్ కుమార్ గా, దివాన్ ఛమన్ కుమార్ గానూ అశోక్ కుమార్ వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. వీణా, జీవన్, ప్రాణ్, కుల్దీప్ కౌర్, కుక్కు, తబస్సుమ్, బాలనటునిగా జగ్ దీప్ నటించారు. ఈ చిత్రానికి హుస్న్ లాల్ భగత్ రామ్ సంగీతం సమకూర్చగా, అసద్ భోపాలీ పాటలు రాశారు. ఇందులోని మహ్మద్ రఫీ పాడిన “దునియా ఏక్ కహానీ రే భయ్యా…” పాట ఆ రోజుల్లో ఎంతగానో అలరించింది. షంషాద్ బేగం పాడిన “మొహబ్బత్ కా దోనో…” పాట ఆకట్టుకుంది. లతా మంగేష్కర్ గాత్రంలో జాలువారిన “కహా హై తూ మేరే సప్నోంకీ రాజా…”, “వో ఆయే బహారే లాయే…”, “ఖుషియోం కే దిన్…” వంటి పాటలు మురిపించాయి. కొన్ని చోట్లనే ద్విపాత్రాభినయం కనిపించినా, దానిని చక్కగా తెరకెక్కించడంలో రాజేంద్ర మలోనే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?