బి.ఆర్.చోప్రా తొలిచిత్రం ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 7న ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు పూర్తి)
దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత బి.ఆర్.చోప్రా. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అఫ్సానా’. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘అఫ్సానా’ 1951 సెప్టెంబర్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి ఐ.ఎస్.జోహార్ కథ, మాటలు సమకూర్చారు. షదీలాల్ హండాతో కలసి బి.ఆర్.చోప్రా ఈ సినిమాను నిర్మించారు. త్రిభువన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
‘అఫ్సానా’ సినిమా కథ చదువుతున్నట్టుగానే చిత్రీకరించారు. టైటిల్ కార్డ్స్ సమయంలోనే ఓ చేయి పుస్తకం తిప్పుతూ ఉంటుంది. టైటిల్స్ పూర్తి కాగానే కవల సోదరులు రతన్, చమన్ , వారి నేస్తం మీరా కలసి నాటకం వేసే దృశ్యంతో చిత్రం మొదలవుతుంది. ఆ నాటకంలో ఇద్దరు కవలల్లో ఎవరు పెద్దవారు అనే దానిపై చర్చసాగి, ఓ విధూషకుడు వచ్చి ఆ చిక్కు ముడిని విప్పి రతన్ పెద్ద అని తేలుస్తాడు. ఇదే తీరున వారి జీవితం కూడా సాగడం విశేషం. ఓ ప్రదర్శనకు వెళ్ళిన రతన్, చమన్, మీరా విడిపోతారు. చమన్ , మీరా మిగులుతారు. రతన్ ఎక్కడిపోయాడో తెలియదు. మీరా మాత్రం రతన్ తిరిగి వస్తాడని వేచి ఉంటుంది. చమన్, రసిలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ గొడవలో చమన్ ఓ వ్యక్తిని చంపుతాడు. దాంతో చమన్ పరారీ అవుతాడు. అయితే అది ప్రమాదవశాన జరిగిన మరణం అని కోర్టు చమన్ ను విడుదల చేస్తుంది. అయితే వచ్చిన చమన్ లో తేడా కనిపిస్తుంది. అతనికి రసిలీ కంటే మీరా అంటే ఆసక్తి కలుగుతుంది. చివరకు రతన్ మిగిలాడని తేలిపోవడంతో కథ ముగుస్తుంది.
తొలి చిత్రంలోనే అశోక్ కుమార్ వంటి నాటి మేటి హీరోతో ద్విపాత్రాభినయం చేయించి, ఎంతగానో ఆకట్టుకున్నారు బి.ఆర్.చోప్రా. ఈ చిత్రంలో రతన్ కుమార్, జడ్జి అశోక్ కుమార్ గా, దివాన్ ఛమన్ కుమార్ గానూ అశోక్ కుమార్ వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. వీణా, జీవన్, ప్రాణ్, కుల్దీప్ కౌర్, కుక్కు, తబస్సుమ్, బాలనటునిగా జగ్ దీప్ నటించారు. ఈ చిత్రానికి హుస్న్ లాల్ భగత్ రామ్ సంగీతం సమకూర్చగా, అసద్ భోపాలీ పాటలు రాశారు. ఇందులోని మహ్మద్ రఫీ పాడిన “దునియా ఏక్ కహానీ రే భయ్యా…” పాట ఆ రోజుల్లో ఎంతగానో అలరించింది. షంషాద్ బేగం పాడిన “మొహబ్బత్ కా దోనో…” పాట ఆకట్టుకుంది. లతా మంగేష్కర్ గాత్రంలో జాలువారిన “కహా హై తూ మేరే సప్నోంకీ రాజా…”, “వో ఆయే బహారే లాయే…”, “ఖుషియోం కే దిన్…” వంటి పాటలు మురిపించాయి. కొన్ని చోట్లనే ద్విపాత్రాభినయం కనిపించినా, దానిని చక్కగా తెరకెక్కించడంలో రాజేంద్ర మలోనే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..