బి.ఆర్.చోప్రా తొలిచిత్రం ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 7న ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు పూర్తి)
దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత బి.ఆర్.చోప్రా. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అఫ్సానా’. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘అఫ్సానా’ 1951 సెప్టెంబర్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి ఐ.ఎస్.జోహార్ కథ, మాటలు సమకూర్చారు. షదీలాల్ హండాతో కలసి బి.ఆర్.చోప్రా ఈ సినిమాను నిర్మించారు. త్రిభువన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
‘అఫ్సానా’ సినిమా కథ చదువుతున్నట్టుగానే చిత్రీకరించారు. టైటిల్ కార్డ్స్ సమయంలోనే ఓ చేయి పుస్తకం తిప్పుతూ ఉంటుంది. టైటిల్స్ పూర్తి కాగానే కవల సోదరులు రతన్, చమన్ , వారి నేస్తం మీరా కలసి నాటకం వేసే దృశ్యంతో చిత్రం మొదలవుతుంది. ఆ నాటకంలో ఇద్దరు కవలల్లో ఎవరు పెద్దవారు అనే దానిపై చర్చసాగి, ఓ విధూషకుడు వచ్చి ఆ చిక్కు ముడిని విప్పి రతన్ పెద్ద అని తేలుస్తాడు. ఇదే తీరున వారి జీవితం కూడా సాగడం విశేషం. ఓ ప్రదర్శనకు వెళ్ళిన రతన్, చమన్, మీరా విడిపోతారు. చమన్ , మీరా మిగులుతారు. రతన్ ఎక్కడిపోయాడో తెలియదు. మీరా మాత్రం రతన్ తిరిగి వస్తాడని వేచి ఉంటుంది. చమన్, రసిలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ గొడవలో చమన్ ఓ వ్యక్తిని చంపుతాడు. దాంతో చమన్ పరారీ అవుతాడు. అయితే అది ప్రమాదవశాన జరిగిన మరణం అని కోర్టు చమన్ ను విడుదల చేస్తుంది. అయితే వచ్చిన చమన్ లో తేడా కనిపిస్తుంది. అతనికి రసిలీ కంటే మీరా అంటే ఆసక్తి కలుగుతుంది. చివరకు రతన్ మిగిలాడని తేలిపోవడంతో కథ ముగుస్తుంది.
తొలి చిత్రంలోనే అశోక్ కుమార్ వంటి నాటి మేటి హీరోతో ద్విపాత్రాభినయం చేయించి, ఎంతగానో ఆకట్టుకున్నారు బి.ఆర్.చోప్రా. ఈ చిత్రంలో రతన్ కుమార్, జడ్జి అశోక్ కుమార్ గా, దివాన్ ఛమన్ కుమార్ గానూ అశోక్ కుమార్ వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. వీణా, జీవన్, ప్రాణ్, కుల్దీప్ కౌర్, కుక్కు, తబస్సుమ్, బాలనటునిగా జగ్ దీప్ నటించారు. ఈ చిత్రానికి హుస్న్ లాల్ భగత్ రామ్ సంగీతం సమకూర్చగా, అసద్ భోపాలీ పాటలు రాశారు. ఇందులోని మహ్మద్ రఫీ పాడిన “దునియా ఏక్ కహానీ రే భయ్యా…” పాట ఆ రోజుల్లో ఎంతగానో అలరించింది. షంషాద్ బేగం పాడిన “మొహబ్బత్ కా దోనో…” పాట ఆకట్టుకుంది. లతా మంగేష్కర్ గాత్రంలో జాలువారిన “కహా హై తూ మేరే సప్నోంకీ రాజా…”, “వో ఆయే బహారే లాయే…”, “ఖుషియోం కే దిన్…” వంటి పాటలు మురిపించాయి. కొన్ని చోట్లనే ద్విపాత్రాభినయం కనిపించినా, దానిని చక్కగా తెరకెక్కించడంలో రాజేంద్ర మలోనే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!