బద్వేల్లో ఏకపక్ష ఎన్నికలు.. ఈసీకి బీజేపీ కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లాలో ఈ నెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ సీరియస్ అయింది. కడప నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ ను కలిసి బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యులు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులను కలిసిన వారిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.
బద్వేల్ లో జరగబోయే ఉప ఎన్నిక స్థానిక పోలీసులతో నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ నేతలను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకూ అందరినీ ఉప ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరారు బీజేపీ నేతలు. వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
- Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
- Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి పై వివరించామని, స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం 15 ఫ్లటూన్ల ప్యారామిలిటరీ బలగాలను పంపారన్నారు సోము వీర్రాజు. స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు అవసరం అన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏజెంట్లుగా కూర్చోవడానికి లేకుండా బెదిరిస్తున్నారన్నారు. పారా మిలిటరీ బలగాలతో పేరేడ్ నిర్వహించి ఓటర్లలో నమ్మకం కలిగించాలన్నారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను విధుల నుంచి తోలగించాలని కోరాం..
మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదని, బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బద్వేల్ లో తిష్ట వేశారన్నారు. ఓటర్లకు విశ్వాసం కలిగించేలా ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ప్రజల్లోకి వస్తే నిలదీస్తారనే సీఎం ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?