కేంద్రం కీలక నిర్ణయం.. టెలికం రంగానికి భారీ ఊరట..!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇబ్బందులతో సతమతం అవుతోన్న టెలికం రంగానికి ఊరట కలిగిస్తూ.. టెలికం సంస్థల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు అనుమతిస్తూ ఇస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్.. మోడీ సర్కార్ తాజా నిర్ణయంతో ప్రైవేట్ టెలికం రంగ సంస్థలైన వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి సంస్థలకు ఊరట కలగనుంది.. అప్పుల్లో కూరుకుపోయిన టెలికం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది నరేంద్ర మోడీ సర్కార్.. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
టెలికం రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణం అన్నారు మంత్రి అశ్వినీ వైష్ణవ్.. దీంతో.. ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించిన ఆయన.. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుందన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలను హేతుబద్ధీకరించినట్లు తెలియజేశారు. స్పెక్ట్రం కాలవ్యవధి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా ఉండగా ఇకపై 30 ఏళ్లకు పెంచనున్నట్టు తెలిపారు. టెలికం రంగంలో 100 శాతం ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉంటుందని వెల్లడించారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!