మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ చేసిన ట్వీట్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుని మీద పెట్టిన ట్వీట్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక బీజేపీ ఉందని… బండి సంజయ్ ఉన్నారని… ఇది ఆ పార్టీ సంస్కృతి అని ఆరోపించారు. బీజేపీ నాయకులకు ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకి చెప్పు దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు.