అమరావతి రాజధాని రైతులకు షాకిచ్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పాదయాత్ర నేటితో 31వ రోజుకు చేరగా.. ఈరోజు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోకి రాజధాని రైతుల పాదయాత్ర ప్రవేశించగా… వారికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈరోజు రైతుల పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కూడా పాల్గొన్నారు.
Read Also: తిరుమల దర్శనాలను వాయిదా వేసుకోండి: టీటీడీ ఛైర్మన్
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
అయితే పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు పోలీసులు షాకిచ్చారు. పాదయాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను వారు అడ్డుకున్నారు. ప్రచార రథాలను వెంట తీసుకువెళ్లరాదంటూ వారు స్పష్టం చేశారు. దీంతో ప్రచార రథాలను అనుమతించాలని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రచార రథాలను పోలీసులు అడ్డుకోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి అమరావతి రైతులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రచార రథాలను అడ్డుకోవడం సరికాదని.. తమ మనోభావాలు దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆంక్షల పేరుతో సంఘీభావం తెలుపుతున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు. కోర్టు అనుమతి ప్రకారమే తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. కాగా రైతుల ఆందోళనతో నెల్లూరు-పొదలకూరు మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!