Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Bjp Mps Strong Comments On Jagan Rule

ఏపీలో బూతుపురాణం తప్ప ప్రగతి శూన్యం.. బీజేపీ ఎంపీలు

Published Date :December 4, 2021 , 4:39 pm
By NTV WebDesk
ఏపీలో బూతుపురాణం తప్ప ప్రగతి శూన్యం.. బీజేపీ ఎంపీలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో జగన్ పాలనపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని లెంపలేసుకుంటున్న పరిస్థితి వుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. అప్రజాస్వామికంగానే అధికార పార్టీ స్థానిక సంస్థలను చేజిక్కించుకుంది.ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైంది. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.. అదంతా అబద్దం. వైసీపీ మాకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అన్నారు సుజనా చౌదరి.

సంక్షేమ పథకాలకే నిధులు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర నిధులకు స్టిక్కర్లు వేసి తమ పథకాలుగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదు. కొన్నింటిని మళ్లిస్తుంది.. ఇంకొన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వడం లేదు. భారీ ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు జీవీఎల్.

ఈ ప్రభుత్వం దివాళా పరిస్థితిలో ఉందని, కేంద్రం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. ఏపీలో బూతుల పురాణం తప్ప.. అభివృద్ధిపై చర్చా లేదు.. పోరాటం లేదు.ఆ ప్రభుత్వం చేపట్టిన పనులను.. ఈ ప్రభుత్వం తాకదు.. ఈ ప్రభుత్వం చేపట్టే పథకాలను పార్టీ ప్రస్తావించదు. అన్ టచ్ బుల్ ప్రభుత్వాలు ఎందుకు.. బీజేపీని ఎన్నుకోండని ప్రజలని కోరుతున్నాం అన్నారు ఎంపీ టీజీ వెంకటేష్.

గజేంద్ర సింగ్ షెకావత్ కామెంట్ల వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం. తప్పు జరిగింది.. మళ్లీ జరగకుండా చూస్తామని చెప్పాల్సింది పోయి రాజకీయం అంటూ మంత్రి కామెంట్లు చేయడం సరికాదు.కేంద్ర మంత్రి కామెంట్లకు దురుద్దేశ్యాలు ఆపాదిస్తే.. కేంద్రంలో ఇబ్బందులు తప్పవు. ప్రతి నెలా ఇదే మంత్రి వద్దకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతునిధులు వెళ్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఉన్నాను.. నేను విన్నాను అని జగన్ ఇప్పటి వరకు చెప్పారు.. తీరు మారకుంటే భవిష్యత్తులో నేను మరిచాను అని కూడా చెప్పాల్సి వస్తుందన్నారు టీజీ వెంకటేష్.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం ముగిసింది. ఈ సగం రోజుల పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు ఎంపీ సీఎం రమేష్. కడప స్టీల్ ప్లాంట్ పునాది రాయి వేసి రెండేళ్లు గడిచింది.. కానీ అక్కడ పునాది రాయే మిగిలింది తప్ప.. మరేం ప్రగతి లేదు.ఇసుక అక్రమాలు, మట్కా, గుట్కా, గంజాయి వంటి అక్రమాలు బాగా జరుగుతున్నాయి.ఎస్సీ, ఎస్టీ కేసులు లెక్కకు మిక్కిలిగా పెట్టేస్తున్నారు.కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.. ఆయన పైనా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారా..?రాష్ట్రంలో అరాచకం తప్ప మరేం జరగడం లేదు.. దీనికి కారణం పోలీసులు.పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.ఢిల్లీకి వచ్చి ప్రాజెక్టులు.. పథకాలు అడగడం లేదు ,అప్పులు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు.

ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నారు.అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోయాక ముందుగా నేనే విజిట్ చేశాను.అన్నమయ్య ప్రాజెక్టు గేటును ఏడాది నుంచి రిపేర్ చేయలేదన్నారు ఎంపీ సీఎం రమేష్. దీని వెనుకా సీఎం రమేష్, సుజనా ఇద్దరూ ఉన్నారా..?నేను వెళ్లెంత వరకు ఎమ్మార్వో కూడా రాలేదు.కడప కలెక్టర్ కూడా పట్టించుకోలేదని విమర్శించారు ఎంపీ సీఎం రమేష్. మొత్తం మీద వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ ఎంపీలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడం హాట్ టాపిక్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap bjp mps
  • cm jagan
  • cm ramesh
  • GVL Narasimha Rao
  • tg Venkatesh

తాజావార్తలు

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

  • JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions