7వ రోజు కోటి దీపోత్సవం… వైభవంగా ద్వారకాతిరుమల వెంకటేశుడి కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు.

ఏడోరోజు సందర్భంగా తొలుత శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి, శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతరం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం నిర్వహించారు. ఆ తర్వాత వేదిరపై ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపుల పూజను నిర్వహించారు. మరోవైపు భక్తులతో శ్రీవెంకటేశ్వర విగ్రహాలకు ముడుపుల పూజను చేయించారు.
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన

అనంతరం ఏడోరోజు కోటి దీపోత్సవానికి తలమానికంగా అత్యంత వైభవంగా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని కోటి దీపోత్సవం వేదికపై వేదమంత్రోచ్ఛరణల నడుమ వేదపండితులు ఘనంగా జరిపించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని భక్తులను ఆశీర్వదించేందుకు వేదిక ప్రాంగణమంతా ఊరేగించారు. ఈ సందర్భంగా గోవింద నామాలతో యావత్తు వేదిక ప్రాంగణం మార్మోగింది. అనంతరం కోటి దీపోత్సవానికి తరలివచ్చిన భక్తజనం కోటి దీపార్చన నిర్వహించారు.

ఇక కోటి దీపోత్సవం కార్యక్రమంలో లింగోద్భవ ఘట్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారు లింగోద్భవం సన్నివేశాన్ని కన్నులారా చూసి తరించడమే తప్ప మాటల్లో చెప్పడం వీలుకాదు.

అనంతరం నిర్వహించిన సప్తహారతి ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చింది. మంగళవాయిద్యాలు, నృత్యాలతో శోభయమానంగా మారింది. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తితో కార్తీకమాసాన కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొని పునీతులయ్యారనే చెప్పాలి.




తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!