ఏపీలో సీఆర్డీఏ రద్దు, 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ 45 రోజుల మహాపాదయాత్రను చేపట్టారు. నవంబర్ 1 న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ నెల 15న తిరుమలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు 41వ రోజు రాజధాని రైతుల పాదయాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది.
ఈ పాదయాత్రకు ఊరురా రైతులు, ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తి నుంచి 17 కిలోమీటర్ల మేర కొనసాగి అంజిమేడు వరకు పాదయాత్ర సాగనుంది. చిత్తూరు జిల్లా రాచగున్నేరిలో రైతులు భోజన విరామం ఇవ్వనున్నారు. అయితే రాత్రికి చిత్తూరు జిల్లా అంజిమేడులో రైతులు బస చేయనున్నారు.