మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022లో మొదటి రోజే తీవ్ర విషాద ఘటన జరిగింది.. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు.. ఈ తొక్కిసలాటలో మరో 13 మంది భక్తులు గాయపడినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 2.45 గంటలకు ఘటన చోటు చేసుకుంది.. ఒకరినొకరు తోసుకోవడంతో ప్రారంభమై.. చివరకు తీవ్ర తొక్కిసలాట జరిగిందని జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు..
Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరి కొత్త రికార్డు..
Also Read
ఈ ప్రమాదంపై ఓ ప్రకటన విడుదల చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ దత్… మృతుల్లో ఎక్కువ మంది ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు చెందినవారిగా తెలిపారు.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.. మిగతా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ… మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు మరియు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ.
తాజావార్తలు
-
డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!