మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022లో మొదటి రోజే తీవ్ర విషాద ఘటన జరిగింది.. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు.. ఈ తొక్కిసలాటలో మరో 13 మంది భక్తులు గాయపడినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 2.45 గంటలకు ఘటన చోటు చేసుకుంది.. ఒకరినొకరు తోసుకోవడంతో ప్రారంభమై.. చివరకు తీవ్ర తొక్కిసలాట జరిగిందని జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు..
Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరి కొత్త రికార్డు..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఈ ప్రమాదంపై ఓ ప్రకటన విడుదల చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ దత్… మృతుల్లో ఎక్కువ మంది ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు చెందినవారిగా తెలిపారు.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.. మిగతా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ… మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు మరియు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!