ఢిల్లీలో కరోనా బీభత్సం… వెయ్యిమంది పోలీసులకు కోవిడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం కలిగిస్తోంది.ఢిల్లీలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఢిల్లీ వాసుల్ని కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
దేశంలో 4,033 చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
కొవిడ్-19 వ్యాప్తితో ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా పోలీస్ సిబ్బందికి పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. పోలీస్ సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్స్లో భాగం కాబట్టి వైరస్ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు అందుబాటులో వుంచుకోవాలన్నారు. పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధనల్లో సూచించారు. ఢిల్లీలో 80వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
పోలీసులతో పాటు జైళ్ళలోని సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలోని మూడు జైళ్లలో నలభై ఆరు మంది ఖైదీలు, 43 మంది సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. తీహార్లో 29 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మిగిలిన 17 మంది మండోలి జైలులో ఉన్నారు.కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరుగుతున్నందున దేశ రాజధానిలో తదుపరి ఆంక్షలపై చర్చించడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భేటీ అవుతోంది. కరోనా పెరిగినా అదుపులోనే వుందని నిన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అవసరం లేదన్నారాయన.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో కరోనా కట్టడికి ఆంక్షలు మరింత కఠినం చేయనున్నారు. ఇందులో భాగంగా బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తారు. అక్కడ కేవలం టేక్ అవేకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. బస్సులు, మెట్రో రైళ్లలో తక్కువ సీటింగ్ కెపాసిటీతో నడపేందుకు సిద్ధమైంది. కరోనా విజృంభిస్తున్నందున ప్రైవేటు సంస్థలన్నింటినీ 100శాతం వర్క్ ఫ్రం హోంకు పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!