అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్..!
మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారు.. అయితే.. ప్రధాని రాకను కూటమి పార్టీలు తమ స్టైల్ లో వినియోగించుకుంటున్నాయట.. బీజేపీ సైతం భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించిందట.. ప్రతీ జిల్లా నుంచి కో-ఆర్డినేటర్లను సిద్ధం చేసారట.. అలాగే ప్రధానంగా బీజేపీ లుక్ కనిపించేలా చూడాలని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట.. కూటమి పార్టీలలో ప్రతీ విషయంలో కూటమి ధర్మం పేరిట వెనక ఉండిపోయిన బీజేపీని ముందుకు తీసుకురావడానికి మోడీ రాకను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేసారట.. క్షేత్రస్ధాయి బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ బీజేపీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిగా ప్రణాళిక వేసుకుందని సమాచారం.. అమరావతి నుంచి పోలవరం దాకా ప్రతీ అంశంలోనూ బీజేపీ సహకారం ఎంత ఉందో చూపించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారట…
ప్రధాని మోడీ పర్యటన.. అమరావతిని జల్లెడ పడుతున్న ఎస్పీజీ..!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. మే 2వ తేదీన ఏపీ రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు భారత ప్రధాని.. మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.. మంత్రులు, అధికారులతో కమిటీలు వేసి.. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతీరోజూ.. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ ఆరా తీస్తున్నారు.. ఇక, ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందే ఎస్పీజీ రంగంలోకి దిగింది.. అమరావతి చేరుకున్న ప్రధాని మోడీ భద్రతా దళం.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి.. మోడీ టూర్ సాగే రూట్లలో ప్రయాణిస్తూ.. ప్రత్యేకంగా పరిశీలించింది SPG.. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.. భద్రతా ఏర్పాట్లను SPGకి వివరించారు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ అధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని టూర్ కోసం ఏర్పాటైన మంత్రివర్గ సభ్యులు..
పోషించలేక చిన్నారిని వదిలివెళ్లిన తల్లి.. హృదయాన్ని కదిలిస్తోన్న లెటర్..!
ప్రతీ వ్యక్తి జీవితంలో.. పెళ్లి, పిల్లలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. పిల్లలు పుట్టక ఆసుపత్రిలు, గుళ్లు, గోపురాలు, నాటు వైద్యులు చివరకు పూజారుల చుట్టూ తిరిగే తల్లిదండ్రులను చూస్తుంటాం.. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు.. కానీ, ఓ తల్లి తన కన్న బిడ్డని పోషించలేక ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయిన హృదయ విధారకర ఘటన అనంతపురంలో వెలుగు చూసింది.. ఆధునిక సమాజంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందని చెబుతున్నా.. కనీసం కన్నబిడ్డలను కూడా పోషించలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారని చెప్పడానికి ఈ ఘటన అద్దం పడుతోందనే చెప్పాలి.. అనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అభం శుభం తెలియని రోజుల వ్యవధిలో ఉన్న చిన్నారిని గుర్తు తెలియని మహిళ రాత్రి సమయంలో విజయనగర్ కాలనీలోని ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు బయటకు వచ్చి చూడగా ముద్దులొలికే చిన్నారి నుదుటున బొట్టుతో కనిపించింది. చిన్నారి వద్ద ఓ లేఖ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేఖలో తన బిడ్డను నేను పోషించలేక వదిలి వెళ్లిపోతున్నానని.. ఈ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు లేఖలో రాసింది. పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
అలా అయితే భారత్ను వదిలి పాక్కు వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..
పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్ వదిలి వెళ్లిపోండి అంటూ పాకిస్థాన్కు మద్దతు ఇస్తున్నవారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసే.. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భారత్ దేశంలో ఉంటూ పాకిస్థాన్ను ప్రేమిస్తాం అంటారు.. వీళ్లంతా కాంగ్రెస్ నాయకలు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా వున్నట్టు వున్నారు.. అంతలా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే వదిలి వెళ్లిపోండి అని సూచించారు.. జనసేన ఏపీ, తెలంగాణలో ఉంది.. కానీ, జనసేన విధానం జాతీయ వాదం అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
గొప్ప మనసు చాటుకున్న పవన్.. ఉగ్రదాడి అమరుని కుటుంబానికి రూ.50 లక్షల విరాళం..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భారత్ దేశంలో ఉంటూ పాకిస్థాన్ను ప్రేమిస్తాం అంటారు.. వీళ్లంతా కాంగ్రెస్ నాయకలు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా వున్నట్టు వున్నారు.. అంతలా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్ను వదిలి పాకిస్థాన్ వెళ్లిపోండి అని సూచించారు.. జనసేన ఏపీ, తెలంగాణలో ఉంది.. కానీ, జనసేన విధానం జాతీయ వాదం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. కాగా, బెంగళూరులో స్థిరపడిన నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్.. ఈనెల 22న పహల్గామ్లో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా.. ఉగ్రవాదులు కాల్చి చంపారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్కు చెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్న విషయం విదితమే.
మేము ఇచ్చిన స్వేచ్ఛతోనే బీఆర్ఎస్ సభ జరిగింది.. లేకపోతే..
బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు. ఏడాదిలో 22 వేల కోట్లు మాఫీ చేశారు సీఎం రేవంత్.. పదేళ్లలో కేసీఆర్ చేసిన మాఫీ 20 వేల కోట్లు అన్నారు.. ఏడాదిలో 22 వేల కోట్లు మాఫీ చేయడం గొప్పనా? అని ప్రశ్నించారు. పదకొండు ఏండ్లలో 20 వేల కోట్లు ఇవ్వడం గొప్ప నో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు సమయం ఉన్నా.. సీఎం రేవంత్ మీలా సాగదీయలేదన్నారు. ఈ రెండింటి మధ్య తేడాను తెలంగాణ రైతులు గమనించాలని జగ్గారెడ్డి సూచించారు. ఇక, సన్న వడ్లకి క్వింటకు రూ. 500 బోనస్ పై రైతులు సంతోషంగా ఉన్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లో సాగు చేస్తే..75 వేలు బోనస్ వస్తుంది.. రైతులను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు.. సన్నబియ్యంతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లను శభాష్ అంటున్నారు ప్రజలు.. గొప్పలు చెప్పడం లేదు.. ఇది వాస్తవం అన్నారు. ఇక, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కోట్లాడుతున్నారని కేసీఆర్ అంటున్నారు.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం తప్పా అని అడిగారు. సీటు దొరకని వాళ్ళు తిట్టుకుండొచ్చు.. సీట్లో కూర్చున్న మహిళలు మెచ్చుకుంటారు కదా.. గతంలో కేసీఆర్ ఆర్టీసీని కనుమరుగు చేశాడని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
సిద్దుల గుట్టలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నవనాధ సిద్ధుల గుట్ట సమీపంలో భయం భయంగా ఉంది. చిల్డ్రన్ పార్క్ సమీపంలోని రాళ్ళ మధ్యలో చిరుతను స్థానికులు చూశారు. దీంతో చిరుత వీడియోను భక్తులు చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత సంచారంతో భక్తులు, పట్టణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చిరుతను పట్టుకోవడానికి బోన్ ఏర్పాటు చేసి బంధించాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు, చిరుత సంచారంతో సిద్ధుల గుట్ట ప్రధాన ద్వారానికి ఆలయ అధికారులు తాళం వేశారు. పర్యాటకులు, భక్తులకు నవనాధుల సిద్ధుల గుట్టపైకి అనుమతి లేదని తెలిపారు. చిరుత సంచరిస్తున్న సిద్ధుల గుట్ట ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు సందర్శించారు. అక్కడ, చిరుత సంచారాన్ని నిర్ధారించారు. సిద్ధుల గుట్టపై వివిధ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత జడ దొరికే వరకు సిద్ధుల గుట్ట పార్కు దగ్గరకు అనుమతి లేదని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
పోలీస్స్టేషన్కు స్పెషల్ గెస్ట్.. కలియ తిరిగి ఏం చేసిందంటే..!
తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో… సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా పేలుతున్నాయి. అసలు ఆ అతిథి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూరు-ఊటీ జాతీయ రాహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్. సోమవారం రాత్రి 8:30 గంటల సమయం. ఉన్నట్టుండి.. ఒక చిరుత పులి మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చింది. గదిలో కాసేపు కలియ తిరిగింది. ఎవరూ కనిపించలేదు. పైగా భోజనం కూడా దొరకలేదు. ఇక చేసేదేమీలేక.. వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఇక చిరుత పులి లోపలికి వచ్చినప్పుడు.. పక్క గదిలోనే ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. చిరుత లోపలికి రావడం చూసి కిమ్మనకుండా మౌనంగా ఉన్నాడు. అది బయటకు వెళ్లిపోగానే తలుపు మూసేసి.. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
నిఘా వర్గాల హెచ్చరిక.. కాశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత
పహల్గామ్ దాడి తరహాలో మరిన్ని దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత తర్వాత జమ్మూకాశ్మీర్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రణాళిక ప్రకారం కాశ్మీర్లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో 87 పర్యాటక ప్రదేశాల్లో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. కాశ్మీర్లోని ప్రధాన ప్రదేశాలతో పాటు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి. పాకిస్తాన్ గూఢచారి సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI).. ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ జిల్లాల్లో స్థానికేతరులు, సీఐడీ సిబ్బంది, కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడులు చేయాలని ప్లాన్ చేస్తోందని నిఘా సంస్థ సూచించింది. ఉత్తర, దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదులు చురుగ్గా పాల్గొనవచ్చని గుర్తించింది. వీళ్లంతా భారీ స్థాయిలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చని పేర్కొన్నాయి. రైల్వే వ్యవస్థను కూడా టార్గెట్ చేసుకోచ్చని స్పష్టం చేశాయి. రైల్వే భద్రతా వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతున్నాయి. పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. పెరిగిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. సోమవారం కాస్త ఊరటనిచ్చింది. భారీగానే తగ్గింది. దీంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. కానీ ఒక్కరోజు గ్యాప్లోనే మళ్లీ షాకిచ్చింది. ఓ వైపు శుభకార్యాలు.. ఇంకోవైపు ధరల పెరుగుదలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. నేడు తులం బంగారంపై రూ.440 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 89,800 దగ్గర అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరగడంతో రూ. 97,970 దగ్గర ట్రేడ్ అవుతోంది.
మే1న నానిపై ముప్పేట దాడి.. తట్టుకోగలడా
హ్యాట్రిక్ హిట్స్తో మంచి జోష్ మీదున్నాడు నాని. దసరా, సరిపోదా శనివారంతో హండ్రెడ్ క్రోర్ హీరోగా ఛేంజయిన న్యాచురల్ స్టార్ నుండి వస్తోన్న చిత్రం హిట్ 3. ఇప్పటి వరకు నాని కెరీర్లోనే మోస్ట్ వయెలెంట్ పిక్చర్గా రాబోతుంది. మే 1న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు అర్జున్ సర్కార్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో పాటు నాని హీరో కావడంతో హిట్ 3పై భారీ అంచనాలున్నాయి. అయితే హిట్ 3కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు హాలీవుడ్ తో పాటు కోలీవుడ్ చిత్రాలు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పటి వరకు డ్రై సీజన్ నడిచింది. కొన్ని అడపా దడపా చిత్రాలు కొన్ని డబ్బింగ్ మూవీస్ సందడి చేశాయి. ఏప్రిల్ మొత్తం బాక్సాఫీస్ డల్ అయ్యింది. ఇప్పుడు మేలో వచ్చే సినిమాలపైనే హోప్స్. మేడేన వచ్చేస్తున్నాడు నాని. ఇదే సినిమాను పాన్ ఇండియా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే సౌత్, నార్త్ బెల్టులో హిట్ 3తో కొన్ని సినిమాలు పోటీపడుతున్నాయి. ముందుగా సూర్య.. హిట్ 3కి పోటీగా రెట్రోను మల్టీ లాంగ్వెజ్లో సినిమాను దింపుతున్నాడు. అలాగే టూరిస్ట్ ఫ్యామిలీ తమిళనాడులో రెట్రోతో పాటు హిట్ 3కి పోటీగా రాబోతుంది. హిందీ బెల్ట్లో చూస్తే సీనియర్లు అజయ్ దేవగన్ 2018లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ రైడ్కు సీక్వెల్గా రైడ్ 2 మే 1న రిలీజ్ చేస్తున్నాడు. సంజయ్ దత్ ది భూత్నీ కూడా అదే రోజు భయపెట్టేందుకు వస్తోంది. ఈ సినిమాలకే పిచ్చ కాంపిటీషన్ ఉంటే హాలీవుడ్ నుండి ధండర్ బోల్ట్స్ వివిధ భాషల్లో రిలీజౌతుంది. ఇంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ.. డేర్ చేసి వస్తున్నాడు నాని. ఇప్పటికే విపరీతమైన ప్రమోషన్లను చేసిన న్యాచురల్ స్టార్. వీటికి తోడు ఐపీఎల్ ఉండనే ఉంది. మరీ ఇన్ని అవరోధాలను దాటుకుని నాని హిట్3 ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
కొరియన్ కనకరాజ్ కోసం కసక్ బ్యూటీ
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో డౌన్ ఫాల్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎన్నో ఆశలు పెట్టుకున్న మట్కా మొదటి ఆటకే మకాం సర్దేసింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని కథలపై ద్రుష్టి పెట్టిన ఈ మెగా హీరో యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కొరియన్ కనకరాజ్ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఆచార్య సెట్ లో జరుగుతుంది. సినిమాలో వచ్చే ఐటమ్ సాంగ్ కోసం అక్కడ నిర్మించిన ప్రత్యేక సెట్స్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ కోసం హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. హుషారు, బంగార్రాజు వంటి సినిమాలలో మెప్పించిన దక్షా నాగర్కర్ కొరియన్ కనకరాజ్ లో వరుణ్ తేజ్ తో కలిసి ఆడిపాడనుంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వలని భావిస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తైక్వాండో లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి వరుణ్ ఆశను మేర్లపాక గాంధీ నెరవేరుస్తాడో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది.